స్థానిక సంస్థల ఎన్నికలు 2025 : సర్పంచ్ పదవి పోటీకి అర్హతలెంటో తెలుసా..? ఈ విషయాలు తెలుసుకోండి-do you know the qualifications required to contest in the local body elections in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  స్థానిక సంస్థల ఎన్నికలు 2025 : సర్పంచ్ పదవి పోటీకి అర్హతలెంటో తెలుసా..? ఈ విషయాలు తెలుసుకోండి

స్థానిక సంస్థల ఎన్నికలు 2025 : సర్పంచ్ పదవి పోటీకి అర్హతలెంటో తెలుసా..? ఈ విషయాలు తెలుసుకోండి

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. త్వరలోనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే వారికి తప్పనిసరిగా కొన్ని అర్హతలు ఉండాలి. లేకపోతే పోటీకి అవకాశం ఉండదు.

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు

తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా... త్వరలోనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించిన తర్వాత... గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. అయితే కీలకమైన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసే వారికి ఉండాల్సిన అర్హతలెంటో ఇక్కడ తెలుసుకోండి...

  • సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి కచ్చితంగా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో స్థానికుడై ఉండాలి.
  • పోటీలో ఉండాలనుకునే వ్యక్తి పేరు ఓటర్ లిస్టులో ఉండాలి.
  • నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి వయసు 21 ఏళ్లు పూర్తి అయి ఉండాలి.
  • జనరల్ కేటగిరి నుంచి ఏవరికైనా అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు కూడా పోటీ చేయవచ్చు.
  • మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు.

వీరు అనర్హులు…

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులు.
  • చట్టం ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థకు చెందిన ఉద్యోగులు పోటీకి అనర్హులవుతారు.
  • ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు కూడా దీనికి అనర్హులే.
  • మతిస్థిమితం లేని వారు.బదిరులు, మూగవారు అనర్హులు.
  • గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు.బకాయిల చెల్లింపులకు నోటీసులు ఇచ్చినా చెల్లించిన వారు పోటీకి అనర్హులు.

ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం… రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు అక్టోబర్ 13, 21, 25 తేదీల్లో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4, మూడో విడత నవంబర్ 8 నిర్వహిస్తామన్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వా ఫలితాలు వెల్లడిస్తారు. మెుత్తం ఐదు దశల్లో ఎన్నికలను ప్లాన్ చేశారు.

12,733 గ్రామ పంచాయితీలకు గానూ 1,12, 288 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికలకు 15,522 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.ఇక ఓటర్ల వివరాల విషయానికొస్తే.. పురుషులు 81,65,894, మహిళలు 85,36,770 మంది, ఇతరులు 504 మంది ఓటర్లు ఉన్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం