Bhatti Vikaramarka: కీసరగట్టు శివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క-deputy cm mallu bhatti vikramarka at keesaragattu shivaratri celebrations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhatti Vikaramarka: కీసరగట్టు శివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Bhatti Vikaramarka: కీసరగట్టు శివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Sarath Chandra.B HT Telugu

Bhatti Vikaramarka: మహా శివరాత్రి సందర్భంగా కీసరగట్టులో జరిగిన శివరాత్రి వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహించినట్టు చెప్పారు.

శివరాత్రి పూజల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు

Bhatti Vikaramarka: రాష్ట్ర ప్రజలు సుభీక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం, రాహుల్ గాంధీ పేరిట పూజలు నిర్వహించినట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జాతరలో చిన్న నాటి మిత్రులతో కలసి మిఠాయిలు కొనుక్కొని సందడి చేశారు.

రాష్ట్ర ప్రజలు సబీక్షంగా ఉండాలని, ప్రపంచం లో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారంతా క్షేమం గా ఉండాలని ఆ శివపార్వతులను వేడు కున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఆయన సతీమణి మల్లు నందినితో కలిసి స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మిపురం లోని పురాతన శివాలయం లో, మధిర నియోజకవర్గ కేంద్రంలో నీ శివాలయం లో పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కుటుంబం పేరిట దేవాలయాల్లో మల్లు భట్టి విక్రమార్క పూజలు చేయించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని ఆయన పూజలు నిర్వహించారు.

స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో శివపార్వతుల పూజ అనంతరం జాతరలో ఏర్పాటుచేసిన దుకాణాల్లో చిన్ననాటి మిత్రులతో కలిసి కలియతిరిగారు. మిఠాయిలు కొనుగోలు చేసి మిత్రులకు పంచుతూ ఆనందంగా గడిపారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు.

కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం