తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ఇందిరమ్మ ఇండ్లు. ఈ పథకం కింద లబ్ధిదారులకు నాలుగు దశల్లో బిల్లులు చెల్లిస్తారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. ఇంటి నిర్మాణం ఏ దశలో ఉన్నప్పుడు ఎంత బిల్లు వస్తుంది.. ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పునాది నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారుల ఖాతాలో రూ. 1 లక్ష ఖాతాలో జమ చేస్తారు.
గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారుల ఖాతాలో రూ. 1.25 లక్షలు ఖాతాలో జమ చేస్తారు.
స్లాబ్ నిర్మాణ సమయంలో లబ్ధిదారులకు రూ. 1.75 లక్షలు ఖాతాలో జమ చేస్తారు.
ఇంటి నిర్మాణం పూర్తిగా పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు రూ. 1 లక్ష ఖాతాలో జమ చేస్తారు. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది.
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు కోసం ప్రభుత్వం ఔట్సోర్సింగ్ విధానంలో ఏఈలను నియమిస్తోంది. ఈ పథకం అమలులో ఏఈల పాత్ర కీలకం. వారు గృహ నిర్మాణ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. గృహాలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరిస్తారు. దీని ద్వారా పథకంలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏఈల పరిశీలన తర్వాత బిల్లులు ఖాతాల్లో జమ అవుతాయి.
ఇందిరమ్మ ఇళ్లకు ప్రధాన అర్హత పేదరికం.
సొంత నివాస స్థలం ఉండి, ఇల్లు లేని నిరుపేదలకు ప్రాధాన్యత ఇస్తారు.
గుడిసెలు, తాత్కాలిక నివాసాలలో నివసించేవారికి ఇళ్లు కేటాయిస్తారు.
వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయినవారికి ఇళ్లు కేటాయిస్తారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. ఈ వర్గాలలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తారు.
దివ్యాంగులు, వితంతువులకు ప్రాధాన్యత ఇస్తారు.
గ్రామసభల ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు.
అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి ప్రభుత్వం సర్వేలు నిర్వహిస్తుంది.
లబ్ధిదారుల గుర్తింపు కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను పరిశీలిస్తారు.
అర్హులైన లబ్ధిదారులను ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేస్తారు.
ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం కూడా అందుబాటులో ఉంది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం దశలవారీగా జరుగుతుంది.
ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేస్తారు.
సంబంధిత కథనం