ఇందిరమ్మ ఇండ్ల బిల్లు.. ఏ దశలో ఎంత వస్తుంది.. ఎవరు అప్రూవ్ చేయాలి.. పూర్తి వివరాలు ఇవే-complete details regarding the construction of indiramma houses and payment of bills ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇందిరమ్మ ఇండ్ల బిల్లు.. ఏ దశలో ఎంత వస్తుంది.. ఎవరు అప్రూవ్ చేయాలి.. పూర్తి వివరాలు ఇవే

ఇందిరమ్మ ఇండ్ల బిల్లు.. ఏ దశలో ఎంత వస్తుంది.. ఎవరు అప్రూవ్ చేయాలి.. పూర్తి వివరాలు ఇవే

ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు సర్కారు రూ.5 లక్షలు సాయం చేయనుంది. ఈ సాయం దశల వారీగా లబ్ధిదారులకు అందుతుంది. అయితే.. ఏ దశలో ఎంత బిల్లు వస్తుంది.. దాన్ని ఎవరు అప్రూవ్ చేయాలనే విషయంపై చాలామందికి అవగాహన లేక ఇబ్బందిపడుతున్నారు.

ఇందిరమ్మ ఇల్లు నమూనా చిత్రం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ఇందిరమ్మ ఇండ్లు. ఈ పథకం కింద లబ్ధిదారులకు నాలుగు దశల్లో బిల్లులు చెల్లిస్తారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. ఇంటి నిర్మాణం ఏ దశలో ఉన్నప్పుడు ఎంత బిల్లు వస్తుంది.. ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పునాది పూర్తయిన తర్వాత..

పునాది నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారుల ఖాతాలో రూ. 1 లక్ష ఖాతాలో జమ చేస్తారు.

గోడలు నిర్మించిన తర్వాత..

గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారుల ఖాతాలో రూ. 1.25 లక్షలు ఖాతాలో జమ చేస్తారు.

స్లాబ్ దశలో..

స్లాబ్ నిర్మాణ సమయంలో లబ్ధిదారులకు రూ. 1.75 లక్షలు ఖాతాలో జమ చేస్తారు.

పూర్తి నిర్మాణం తర్వాత..

ఇంటి నిర్మాణం పూర్తిగా పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు రూ. 1 లక్ష ఖాతాలో జమ చేస్తారు. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది.

ఏఈల పాత్ర కీలకం..

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు కోసం ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ విధానంలో ఏఈలను నియమిస్తోంది. ఈ పథకం అమలులో ఏఈల పాత్ర కీలకం. వారు గృహ నిర్మాణ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. గృహాలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరిస్తారు. దీని ద్వారా పథకంలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏఈల పరిశీలన తర్వాత బిల్లులు ఖాతాల్లో జమ అవుతాయి.

అర్హులు..

ఇందిరమ్మ ఇళ్లకు ప్రధాన అర్హత పేదరికం.

సొంత నివాస స్థలం ఉండి, ఇల్లు లేని నిరుపేదలకు ప్రాధాన్యత ఇస్తారు.

గుడిసెలు, తాత్కాలిక నివాసాలలో నివసించేవారికి ఇళ్లు కేటాయిస్తారు.

వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయినవారికి ఇళ్లు కేటాయిస్తారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. ఈ వర్గాలలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తారు.

దివ్యాంగులు, వితంతువులకు ప్రాధాన్యత ఇస్తారు.

ఎంపిక విధానం..

గ్రామసభల ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు.

అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి ప్రభుత్వం సర్వేలు నిర్వహిస్తుంది.

లబ్ధిదారుల గుర్తింపు కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను పరిశీలిస్తారు.

అర్హులైన లబ్ధిదారులను ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేస్తారు.

ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం కూడా అందుబాటులో ఉంది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం దశలవారీగా జరుగుతుంది.

ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేస్తారు.

సంబంధిత కథనం