ప్రజలపై యుద్ధం చేసి, బాగుపడినవారు ఎవరూ లేరు-ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు-cm revanth reddy warns against war on public amidst rtc strike urges resolution ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ప్రజలపై యుద్ధం చేసి, బాగుపడినవారు ఎవరూ లేరు-ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రజలపై యుద్ధం చేసి, బాగుపడినవారు ఎవరూ లేరు-ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు ప్రజలపై సమరం చేస్తున్నాయా? అని మండిపడ్డారు. నన్ను కోసినా వచ్చిన ఆదాయానికి మించి నేనేం చేయలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలపై యుద్ధం చేసి, బాగుపడినవారు ఎవరూ లేరు-ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. సమ్మె నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదంటూ ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ యూనియన్ల సమరం తెలంగాణ ప్రజలపైనా? గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? సమ్మె అంటూ ప్రశ్నించారు.

గత ప్రభుత్వ బకాయిలు

"ప్రతీ నెలా రూ. 7 వేల కోట్లు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలుగా ఇస్తున్నాం. గత పాలకులు రూ. 8,500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారు. కేవలం పదహారు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలకు రూ. 30 వేల కోట్ల నగదును బదిలీ చేసింది. ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లింది గత ప్రభుత్వం"- సీఎం రేవంత్ రెడ్డి

చర్చకు రండి

ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలు, సమరమని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిపై సమరం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా? అని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే కూర్చొని చర్చించుకుందాని, ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు.

ప్రజలపై యుద్ధమా?

"ప్రజలపై యుద్ధం చేసి, బాగుపడినవారు ఎవరూ లేరు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచాలనే కొన్ని రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థలు కుప్పకూలుతాయి. బాధ్యతగా వ్యవహరించాల్సిన కార్మిక సంఘాలు, బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదు"-సీఎం రేవంత్ రెడ్డి

కుటుంబ పరువును బజారున పడేయొద్దు

రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దంటూ కార్మిక సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను కోసినా వచ్చిన ఆదాయానికి మించి నేను ఏం చేయలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తి ఇప్పుడు ఫామ్ హౌస్‌లో హాయిగా పాడుకున్నారంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు.

ఉద్యోగ సంఘాల స్పందన

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు స్పందించాయి. తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సబ్ కమిటీ ఏర్పాటై, ఏడు నెలలు గడిచినా ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని ఆరోపించాయి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలకు ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు.

ఉద్యమం చేస్తున్నాం సమరం కాదు

"సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలని పిలిచారు. కానీ మంత్రులు చర్చకు సమయం కేటాయించడం లేదు. గత ప్రభుత్వం విజ్ఞప్తులకు స్పందించకపోవడం వాస్తవమే అన్నారు. విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. మేము ఉద్యమం చేస్తున్నాం, సమరం కాదు. మంత్రుల కోసం గంటల తరబడి ఎదురుచూశాం. అడగొద్దు అంటే అడగం"- ఉద్యోగ సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్

మంత్రుల కమిటీ చర్చించడంలేదు

ముఖ్యమంత్రి తండ్రి పాత్రలో ఉన్నారు. మీరిచ్చిన గంట సమయం మాకు విలువైనదని టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ అన్నారు. కానీ మంత్రులు మాత్రం మాట్లాడటం లేదన్నారు. ప్రజలపై యుద్ధం చేయాలని తాము కోరడం లేదని, సబ్ కమిటీ అసలు సమస్యలపై చర్చించలేదన్నారు. సీఎం చెప్పినట్లే కొన్ని సంఘాల నేతలు ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యారన్నారు.

ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు అర్థం చేసుకోగలమని, కానీ మాతో మాట్లాడి సమస్యలు పరిష్కారించాలని కోరారు.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.