Vemulawada CM Tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి హోదాలో తోలిసారి జిల్లాకు వచ్చిన సీఎంకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటంచనున్నారు. వేములవాడకు చేరుకునున్న సీఎంకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు స్వాగతం పలికారు.
సీఎం రేవంత్ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుని, అభిషేకం నిర్వహించి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ వేములవాడ ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ. 800 కోట్లతో వివిధ అభివృద్ధి సంక్షేమ పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని అన్నదాన సత్రానికి 35.25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగష్టులో స్వామి వారి దర్శనానికి వచ్చినపుడు హామీ ఇచ్చి, కేవలం మూడు నెలలు గడిచేలోగా ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తర్వులు ఇప్పించారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా, మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి అన్నదాన సత్రం మంజూరు చేయడం పై రాజన్న భక్తుల హర్షం