మూసీ నదిని ప్రక్షాళన దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా… ముందుకే సాగుతున్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా శుద్ధీకరణ, నదికి పునరుజ్జీవం కల్పించాల్సిన అత్యవసర పరిస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. అందులో భాగంగానే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాత్రకు సిద్ధమయ్యారు.
నల్లగొండ జిల్లా ప్రజలు, మూసీ పరీవాహక ప్రాంత రైతాంగంలోకి విస్తృతంగా తీసుకువెళ్లే పనిలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉంది. మూసీ ప్రక్షాళణ విషయంలో ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో మల్లన్నసార్ నుంచి యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు తాగునీరు అందించే ప్రాజెక్టును రూ.210 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనుండగా ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.
మూసీ పునరుజ్జీవన సంకల్ప యాత్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి… మూసీ పరీవాహక ప్రాంత రైతులను కలుస్తూ, వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. మూసీ మురుగునీటి ప్రధాన బాధితులుగా ఉన్న ఉమ్మడి నల్గొండ రైతాంగం, ప్రజల మద్దతు కూడగట్టేందుకు సీఎం పర్యటనను ఉపయోగించుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు సిద్ధం చేశారు.
సంబంధిత కథనం