కేసీఆర్‌ స్పీచ్‌లో పస లేదు.. కక్ష సాధింపులు అలవాటు లేదు.. ఆ అధికారుల గురించి తెలుసు.. మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌-cm revanth reddy hot comments on brs president kcr in media chitchat ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కేసీఆర్‌ స్పీచ్‌లో పస లేదు.. కక్ష సాధింపులు అలవాటు లేదు.. ఆ అధికారుల గురించి తెలుసు.. మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌

కేసీఆర్‌ స్పీచ్‌లో పస లేదు.. కక్ష సాధింపులు అలవాటు లేదు.. ఆ అధికారుల గురించి తెలుసు.. మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌

Sarath Chandra.B HT Telugu

కేసీఆర్‌ పదేళ్ల విధ్వంసాన్ని చేయడానికే తనకు ఏడాది సమయం పట్టిందని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. వరంగల్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలను రేవంత్‌ కొట్టి పారేశారు. ఖమ్మంలో రాహుల్‌ సభకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం బస్సులు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.

సీఏం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు కేసీఆర్‌ కారణమని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి ఏడాది పట్టిందన్నారు. రాహుల్‌కు తనకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఎవరిని నమ్మించాల్సిన అవసరం తనకు లేదన్నారు. బయట వారు ఏమనుకుంటున్నారో తనకు సంబంధం లేదన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న స్కీమ్స్‌ ఏ రాష్ట్రంలో లేవన్నారు.

పార్టీ నేతలపై కూడా సీఎం రేవంత్‌ ఘాటుగా స్పందించారు. తనను నమ్ముకున్న దయాకర్‌కు ఎమ్మెల్సీ వచ్చిందని గుర్తు చేశారు. బయటకు వెళ్లి చెడుగా మాట్లాడే వారితో చెల్లుకు చెల్లు అన్నట్టు ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. స్వీపింగ్ కామెంట్స్‌ చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. తనతో ఉండే వారికి పదవులు దక్కడానికి తన వంతు సహకారం ఉంటుందన్నారు.

ఖమ్మంలో రాహుల్‌ సభకు బస్సులు కూడా ఇవ్వలేదని కేసీఆర్‌ సభకు ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇచ్చామన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన రెండో రోజే కేసీఆర్‌ గుండె పగిలిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఖజానా లూటీ చేసింది కేసీఆర్ అని ఆరోపించారు.

ప్రపంచంలో ఇంధిరా గాంధీకి మించిన యోధురాలు లేరని, ఓ దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీది మాత్రమేనని రేవంత్‌ చెప్పారు. కేసీఆర్, మోడీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారని, నాకు ,రాహుల్ గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉందని రేవంత్‌ మీడియాతో వ్యాఖ్యానించారు. తాేను ఎవర్ని నమ్మించాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీం లు ఏ రాష్ట్రంలో అమలులో లేవన్నారు. ఎన్నికలకు చివరి 6 నెలలు నా పాలనపై చర్చ జరుగుతుందన్నారు.

కగార్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి…

కర్రెగుట్టల్లో జరుగుతున్న కగార్ అంశం పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. కగార్ పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు.

వరంగల్‌ సభలో కేసీఆర్ తన అక్కసు మొత్తం కక్కాడని, పిల్లగాళ్ళు అని కేసీఆర్ అన్నాడని వారినేందుకు అసెంబ్లీకి పంపిస్తున్నాడని ప్రశ్నించారు. సంవత్సరంన్నర నుండి పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు వాటంన్నింటిని స్ట్రీమ్‌ లైన్ చేస్తున్నామన్నారు.

20ఏళ్లు రాజకీయాల్లో ఉంటా…

తాను ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని, చట్టప్రకారమే నడుచుకుంటానని రేవంత్‌ రెడ్డి చెప్పారు. అరెస్టులు చేయమని డిమాండ్ వస్తోందని, తాను అరెస్ట్‌లు చేయమని చెప్పనన్నారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పానని ఇప్పించానన్నారు. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకపడ్డామన్నారు.

అవకాశం లేక కొనసాగిస్తున్నా…

అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశామని, మరో ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నట్టు సీఎం చెప్పారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం