తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు కేసీఆర్ కారణమని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి ఏడాది పట్టిందన్నారు. రాహుల్కు తనకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఎవరిని నమ్మించాల్సిన అవసరం తనకు లేదన్నారు. బయట వారు ఏమనుకుంటున్నారో తనకు సంబంధం లేదన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న స్కీమ్స్ ఏ రాష్ట్రంలో లేవన్నారు.
పార్టీ నేతలపై కూడా సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. తనను నమ్ముకున్న దయాకర్కు ఎమ్మెల్సీ వచ్చిందని గుర్తు చేశారు. బయటకు వెళ్లి చెడుగా మాట్లాడే వారితో చెల్లుకు చెల్లు అన్నట్టు ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. స్వీపింగ్ కామెంట్స్ చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. తనతో ఉండే వారికి పదవులు దక్కడానికి తన వంతు సహకారం ఉంటుందన్నారు.
ఖమ్మంలో రాహుల్ సభకు బస్సులు కూడా ఇవ్వలేదని కేసీఆర్ సభకు ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇచ్చామన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఖజానా లూటీ చేసింది కేసీఆర్ అని ఆరోపించారు.
ప్రపంచంలో ఇంధిరా గాంధీకి మించిన యోధురాలు లేరని, ఓ దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీది మాత్రమేనని రేవంత్ చెప్పారు. కేసీఆర్, మోడీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారని, నాకు ,రాహుల్ గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉందని రేవంత్ మీడియాతో వ్యాఖ్యానించారు. తాేను ఎవర్ని నమ్మించాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీం లు ఏ రాష్ట్రంలో అమలులో లేవన్నారు. ఎన్నికలకు చివరి 6 నెలలు నా పాలనపై చర్చ జరుగుతుందన్నారు.
కర్రెగుట్టల్లో జరుగుతున్న కగార్ అంశం పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. కగార్ పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు.
వరంగల్ సభలో కేసీఆర్ తన అక్కసు మొత్తం కక్కాడని, పిల్లగాళ్ళు అని కేసీఆర్ అన్నాడని వారినేందుకు అసెంబ్లీకి పంపిస్తున్నాడని ప్రశ్నించారు. సంవత్సరంన్నర నుండి పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు వాటంన్నింటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు.
తాను ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని, చట్టప్రకారమే నడుచుకుంటానని రేవంత్ రెడ్డి చెప్పారు. అరెస్టులు చేయమని డిమాండ్ వస్తోందని, తాను అరెస్ట్లు చేయమని చెప్పనన్నారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పానని ఇప్పించానన్నారు. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకపడ్డామన్నారు.
అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశామని, మరో ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నట్టు సీఎం చెప్పారు.
సంబంధిత కథనం