ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రాభివృద్ధి కేంద్ర సహకారం వంటి పలు అంశాలపై ప్రధానికి వినతి పత్రం సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రధానితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి సహకరించమని ప్రధాని మోడీని కోరామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ఇతర అంశాలపై వినతి పత్రాలు ఇచ్చామన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్న ఆయన…. పరిష్కారంపై ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.
ప్రధానితో భేటీ కంటే ముందు కేంద్ర హోంశాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి భేటీ అయ్యారు. విభజన హామీలతో పాటు పలు అంశాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.