Road Accident: హైదరాబాద్ శివారు బండ్లగూడలో కారు బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాక్కు వెళ్తున్న నలుగురిని బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద కారు ఢీకొట్టింది.
బండ్లగూడ సన్ సిటీ వద్ద ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ వాకర్స్పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలతో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కూడా బండ్లగూడ లక్ష్మీనగర్కు చెందిన మహిళలుగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంలో తల్లీకుమార్తెలు మృతిచెందగా మరో బాలుడు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన మహిళలను ఆస్పత్రికి తరలించారు. మృతులను అనురాధ(38), మమత(26)గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహిళలు రోడ్డు పక్కగా వాకింగ్ చేస్తున్న సమయంలో కారు అదుపు తప్పి వారిపైకి దూసుకు వచ్చినట్లు చెబుతున్నారు.