గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకం లేమి తేటతెల్లమైందని లేఖలో ప్రస్తావించారు.
“ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించింది. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడడం ఆక్షేపనీయం. గ్రూప్ -1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్కు వేర్వేరు హాల్టికెట్ నెంబర్ల కేటాయింపుతో గందరగోళం తెరపైకి వచ్చింది” అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
సంబంధిత కథనం