Nizamabad : నేను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను.. దేనికీ భయపడను : కల్వకుంట్ల కవిత-brs mlc kalvakuntla kavitha sensational comments in nizamabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nizamabad : నేను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను.. దేనికీ భయపడను : కల్వకుంట్ల కవిత

Nizamabad : నేను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను.. దేనికీ భయపడను : కల్వకుంట్ల కవిత

Basani Shiva Kumar HT Telugu
Dec 29, 2024 03:04 PM IST

Nizamabad : నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని స్పష్టం చేశారు. కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత

అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చానని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని.. దేనికీ భయపడబోనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం, దమ్ములేక తనపై, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తమది భయపడే రక్తం కాదని.. భయపెట్టే రక్తమని వ్యాఖ్యానించారు.

yearly horoscope entry point

తప్పు చేయలేదు..

'మేము తప్పు చేయలేదు... భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోంది. రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదు. పేరు మర్పిపోయినా, రైతులు భూములు ఇవ్వకపోయినా కేసులు పెడుతున్నారు. ప్రభుత్వానికి ఎందుకింత భయం?' అని కవిత ప్రశ్నించారు.

ఓపికతో ఉండాలి..

'బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలి. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికే అధికారం ఇచ్చారన్న విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరిచిపోయాయి. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్లం.. గట్టిగా నిలబడుతాం.. ప్రజల పక్షనా పోరాటం చేస్తాం. డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైంది? మహిళలకు నెలకు రూ. 2500, కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిలదీశారు.

కాంగ్రెస్ బీరాలు..

'మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదు. బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి వరకు పెన్షన్లు మొత్తాన్ని పెంచలేదు. మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు. ప్రతీ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. విద్యార్థులు, రైతులు, మహిళలను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది' అని కవిత ఆరోపించారు.

కాంగ్రెస్ పోలీసింగ్..

'పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్ పోయి... రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తోంది. రాష్ట్రంలో పోలీసు జులుం నడుస్తున్నది. కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి పనులను ప్రభుత్వం కొనసాగించాలి. రాబోయేది గులాబీ జెండా శకమే. అందులో సందేహమే లేదు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసాపై ప్రభుత్వం మాట్లాడడం లేదు' అని కవిత వ్యాఖ్యానించారు.

ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటారు?..

'గురుకులాలను పడడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదు. ఇప్పటికే 57 మంది పిల్లలను పొట్టనపెట్టుకున్నారు.. ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటారు? ఉద్యోగాల పేరిట రేవంత్ రెడ్డి యువతను తప్పదోవ పట్టిస్తున్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తున్నారు. అటో కార్మికులకు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. మహిళలక ఉచిత బస్సు అని చెప్పి బస్సుల సంఖ్య తగ్గించారు' అని కవిత ఆరోపించారు.

చంద్రబాబు శిష్యుడు..

'రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు. తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారు. మన తెలంగాణ తల్లి మనకు కావాలి. తెలంగాణ తల్లి మాదిరా... కాంగ్రెస్ తల్లి మీదిరా.. మన పొట్టమీదనే కాదు.. మన సంస్కృతిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తున్నది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదు. మళ్లొకసారి నిజామాబాద్ పవర్‌ను రేవంత్ రెడ్డికి రుచి చూపిద్దాం' అని కవిత పిలుపునిచ్చారు.

Whats_app_banner