జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గాయపడిన కేటీఆర్-brs leader ktr injured disc while working out at the gym says in x ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గాయపడిన కేటీఆర్

జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గాయపడిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్ వర్కౌట్స్ చేస్తుండగా గాయపడ్డారు. ఈ విషయాన్ని కేటీఆర్ ఎక్స్ లో పోస్టు చేశారు. తన నడుముకు చిన్న గాయమైందని, త్వరగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానన్నారు.

జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గాయపడిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గాయపడ్డారు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా గాయపడినట్లు కేటీఆర్ తెలిపారు. తన నడుముకు చిన్న గాయమైందంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. వైద్యుల సూచనతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు.

త్వరలో కోలుకుని ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. నిన్న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ పాల్గొ్న్నారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి.

హైకోర్టులో కేటీఆర్ కు భారీ ఊరట

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసును హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం ఈ కేసును జస్టిస్ కె. లక్ష్మణ్ కొట్టివేశారు.

రూ.2500 కోట్ల ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలోని పార్టీ అధిష్టానానికి రూ. 2500 కోట్లు పంపించారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బత్తిన శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు. దీంతో కేటీఆర్‌పై 504, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ముడుపులు చెల్లిస్తేనే అనుమతులు అంటూ

తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన ఆధీనంలో పెట్టుకున్నారని ఆరోపణలు చేశారు. రేవంత్ కు ముడుపులు చెల్లిస్తేనే భవనాలకు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు.

అలా వసూలు చేసిన నగదు రూ.2500 కోట్లు దిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు పంపారని కేటీఆర్ విమర్శలు చేశారు. కేటీఆర్ విమర్శలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత బత్తిన శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు.

రజతోత్సవ సభ సక్సెస్ - కేటీఆర్

తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ అయ్యిందని కేటీఆర్ అన్నారు. లక్షలాదిగా వచ్చిన ప్రజలు చెప్పిన సందేశం అధికారం బీఆర్ఎస్ దేనని కేటీఆర్‌ అన్నారు. ఎల్కతుర్తితో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆయన సోమవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

"బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ చేసిన తెలంగాణకు ధన్యవాదాలు. దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద సభల్లో ఒకటిగా ఈ సభ నిలిచిపోతుంది. నిన్నటి సమావేశం రజతోత్సవ కార్యక్రమాలకు స్టార్టింగ్ మాత్రమే. ఇకపై తానే ముందుండి పోరాడతానని కేసీఆర్‌ చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు బీఆర్ఎస్ సిద్ధం కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చాం. ఇకపై ప్రతి అంశంపై వెంటాడతాం, ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగడతాం"- కేటీఆర్‌

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం