Ration Card Applications : 'ప్రజా పాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా'..? ప్రభుత్వానికి హరీశ్ రావ్ ప్రశ్నలు-brs harish rao slams congress govt over new ration card applications ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ration Card Applications : 'ప్రజా పాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా'..? ప్రభుత్వానికి హరీశ్ రావ్ ప్రశ్నలు

Ration Card Applications : 'ప్రజా పాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా'..? ప్రభుత్వానికి హరీశ్ రావ్ ప్రశ్నలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 08, 2025 10:55 AM IST

BRS Harish Rao On Ration Card Applications : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావ్ ఫైర్ అయ్యారు. మీసేవా దరఖాస్తుల పేరిట రేషన్ కార్డుల విషయంలో మరోసారి కాంగ్రెస్ దగా చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

రేషన్ కార్డుల జారీలో మీసేవా దరఖాస్తుల పేరిట మరోసారి కాంగ్రెస్ దగా చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

“ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. కుల గణనలో వివరాలు తీసుకున్నారు. గ్రామసభల పేరిట డ్రామా చేశారు. ఇప్పుడు మళ్లీ మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీ నేనా..?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

దరఖాస్తులకు విలువ లేదా..? హరీశ్ రావ్

ప్రజాపాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా? అని హరీశ్ రావు నిలదీశారు. బిఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు.

“పేదలకు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన కంటే, కోతలు పెట్టి ఎలా అందకుండా చేయలన్న దానిపైనే మీ ప్రభుత్వ దృష్టి ఉంది. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప… 14 నెలల పాలనలో మీరు చేసిందేముంది…?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

దరఖాస్తుల పేరిట కాలం వెళ్లదీయడం మానేసి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలని హరీశ్ రావ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి, నిరుపేదలకు, రైతులకు బాసటగా నిలవాలని హితవు పలికారు.

మీసేవాలో రేషన్ అప్లికేషన్లు - ప్రభుత్వం నిర్ణయం:

ఇప్పటివరకు ఆఫ్ లైన్ లో గ్రామసభలు, ప్రజాపాలన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. అయితే ఈ విషయంలో గందరగోళంతో పాటు స్పష్టత కొరవడింది. చాలా మంది పలుమార్లు దరఖాస్తులు ఇచ్చారు. దీంతో వెరిఫికేషన్ విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మీసేవాలో ఆన్ లైన్ ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. కొత్త కారులే కాకుండా పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

అయితే ఇప్పటికే గ్రామసభలు, ప్రజాపాలనలో ఇచ్చిన అప్లికేషన్లను పరిగణలోకి తీసుకుంటారా..? లేక మళ్లీ వీరంతా మీసేవా ద్వారా అప్లికేషన్లు ఇవ్వాలా..? అనే విషయంపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం