తెలంగాణ చ‌రిత్రను మలుపు తిప్పింది టీఆర్ఎస్, రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్సే- కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు-brs chief kcr says first villain for telangana is congress on brs silver jubilee meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ చ‌రిత్రను మలుపు తిప్పింది టీఆర్ఎస్, రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్సే- కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ చ‌రిత్రను మలుపు తిప్పింది టీఆర్ఎస్, రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్సే- కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ...కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.

తెలంగాణ చ‌రిత్రను మలుపుతిప్పింది టీఆర్ఎస్, రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్సే- కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ప‌దేండ్లలో తెలంగాణ‌ను ద‌గ‌ద‌గ‌లాడే విధంగా నిర్మించుకున్నామ‌న్నారు. వ‌రంగ‌ల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్సవ స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు కాంగ్రెస్ ఫస్ట్ విలన్ అని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్సే

ఆనాడు, ఈనాడు తెలంగాణకు కాంగ్రెస్సే మొదటి విలన్ అని కేసీఆర్ విమర్శించారు. 1956లో తెలంగాణను ఆంధ్రలో కలిపింది జవహర్ లాల్ నెహ్రూ అని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ నిరంకుశంగా అణచివేసిందని మండిపడ్డారు. 1969లో మూగ‌బోయిన తెలంగాణ నినాదానికి గులాజీ జెండా తిరిగి జోవం పోసిందన్నారు. తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి ఆంధ్రలో వ్యతిరేక ఉద్యమం ప్రారంభం కావడంతో వెనక్కి తగ్గారని ఫైర్ అయ్యారు.

వరంగల్ గడ్డకు ప్రత్యేకత

"ఈ సభను కూడా కొంద‌రు అడ్డుకుంటున్నారు. వరంగల్ గ‌డ్డకు ప్రత్యేక‌త ఉంది. రాణి రుద్రమ ఏలిన వీర‌డ‌గ్డ ఇది. స‌మ్మక్క సార‌క్కల పోర‌గుడ్డ, బ‌మ్మెర పోత‌న క‌విత మాధుర్యం పండించిన జీవ‌గ‌డ్డ, ఈ వ‌రంగ‌ల్ గడ్డకు వంద‌నం చేస్తున్నాను. మ‌న అమ‌ర‌వీరుల‌కు శిర‌స్సు వంచి నివాళుల‌ర్పిస్తున్నాను"- కేసీఆర్

వరంగల్ గడ్డకు ప్రత్యేకత

"ఈ సభను కూడా కొంద‌రు అడ్డుకుంటున్నారు. వరంగల్ గ‌డ్డకు ప్రత్యేక‌త ఉంది. రాణి రుద్రమ ఏలిన వీర‌డ‌గ్డ ఇది. స‌మ్మక్క సార‌క్కల పోర‌గుడ్డ, బ‌మ్మెర పోత‌న క‌విత మాధుర్యం పండించిన జీవ‌గ‌డ్డ, ఈ వ‌రంగ‌ల్ గడ్డకు వంద‌నం చేస్తున్నాను. మ‌న అమ‌ర‌వీరుల‌కు శిర‌స్సు వంచి నివాళుల‌ర్పిస్తున్నాను"- కేసీఆర్

ఏప్రిల్ 27, 2001 మహోజ్వల ఘట్టం

ప్రజ‌లు ప‌రిపాల‌న బాధ్యతలు అప్పగిస్తే విధ్వంస‌మైన తెలంగాణ‌ను వికాసం వైపు న‌డిపించానని కేసీఆర్ అన్నారు. కొండా ల‌క్ష్మణ్ బాపూజీ ఆశ్రయ‌మిస్తే.. ఏప్రిల్ 27, 2001న జ‌ల‌దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావంతో తెలంగాణ చ‌రిత్ర మలుపుతిప్పిన మ‌హోజ్వల‌ ఘ‌ట్టం జరిగిందన్నారు. కులం, మ‌తం, ప‌ద‌వుల కోసం టీఆర్ఎస్ పుట్టలేదని, తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం టీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్నారు. ప‌ద‌వీ త్యాగాల‌తోనే తెలంగాణ ప్రస్థానం మొదలైందని గుర్తుచేశారు.

సమైక్య పాలనలో అణచివేత

"చీక‌ట్లను పార‌దోల‌డానికి ప్రజ‌ల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించ‌డానికి ఆనాడు ఒక మాట చెప్పాను. ఉద్యమం నుంచి వెన‌క్కి మ‌ళ్లితే, ఉద్యమ జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపాండ‌ని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాను. 60 ఏండ్ల స‌మైక్య పాల‌న‌లో ఎంతో వేద‌న, హింస, అణచివేత గురయ్యాం. గోదావ‌రి, కృష్ణా నీళ్లు ద‌క్కకుండా చేసి తెలంగాణ బిడ్డలను వేధించారు. కురువు, కాట‌కాల‌కు తెలంగాణ అల్లాడిపోయింది. పాములు, తేళ్లు కుట్టి అనాథాల్లాగా చ‌నిపోయారు"- కేసీఆర్

తెలంగాణకు ఏం బీమారి వచ్చింది

కాంగ్రెస్ నేతలు ప్రజలను మాటలతో ఏమార్చి అధికారంలోకి వచ్చారని కేసీఆర్ విమర్శించారు. ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణకు ఏం బీమారి వచ్చిందన్నారు. దిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు ఎన్నో హామీలిచ్చి మోసం చేశారన్నారు. పింఛన్ రూ.2 వేలు రూ.4 వేలు చేస్తామన్నారని, రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పిందన్నారు.

హామీలతో ఏమార్చారు

చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికీ పింఛన్లు పెరగలేదు, రుణమాఫీ పూర్తి కాలేదని, ఎన్నో మాటలు చెప్పి ప్రజలను ఏమార్చారని కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఉచిత బస్సులు పెట్టి మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి తెచ్చారన్నారు.

2014 ముందున్న పరిస్థితులు

"కాంగ్రెస్ హామీల గురించి అడిగితే.. సంక్రాంతి, మార్చి అంటూ గడువులు చెబుతున్నారు. నా కళ్లముందే తెలంగాణ ఇలా అయిపోతుంటే దుఃఖం వస్తుంది. మళ్లీ కరెంట్‌ కోతలు, మోటార్లు కాలిపోయే పరిస్థితులు వచ్చాయి. కేసీఆర్‌ మంచిగా ఇచ్చిన కరెంట్‌కు ఇవాళ ఏమైంది. భూములు ధరలు ఎందుకు పడిపోయాయి. నీళ్లు ఎక్కడికి పోయాయి. వడ్లు కొనే దిక్కులేదు రైతులు కల్లాల్లో ఏడుస్తున్నారు. రాష్ట్రంలో 2014కు ముందున్న పరిస్థితులు మళ్లీ వచ్చాయి" - కేసీఆర్‌

అన్యాయాన్ని, అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పోలీసులపై కేసీఆర్ మండిపడ్డారు. "రాసి పెట్టుకోండి..మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే..ఎవ్వడు ఆపలేడు.. ఎవ్వరి తరం కాదు" అని వార్నింగ్ ఇచ్చారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం