Hyd Attack: హైదరాబాద్‌లో ఘోరం, ప్రారంభోత్సవానికి పిలిచి, వ్యభిచారం చేయాలంటూ బాలీవుడ్‌ నటిపై దాడి..-bollywood actress attacked after being invited to the inauguration and asked to commit prostitution ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Attack: హైదరాబాద్‌లో ఘోరం, ప్రారంభోత్సవానికి పిలిచి, వ్యభిచారం చేయాలంటూ బాలీవుడ్‌ నటిపై దాడి..

Hyd Attack: హైదరాబాద్‌లో ఘోరం, ప్రారంభోత్సవానికి పిలిచి, వ్యభిచారం చేయాలంటూ బాలీవుడ్‌ నటిపై దాడి..

Sarath Chandra.B HT Telugu

Hyd Attack: దుకాణం ప్రారంభోత్సవం పేరుతో ముంబై నటిని ఆహ్వానించి ఆపై ఆమెను బంధించి వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

షాప్ ఓపెనింగ్‌కు పిలిచి, యువతిపై అత్యాచార యత్నం

Hyd Attack: హైదరాబాద్ నగరంలో ముంబై నటికి చేదు అనుభవం ఎదురైంది. దుకాణం ప్రారంభోత్సవం పేరుతో పిలిచి ఆ తర్వాత ఆమెతో వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అందుకు నిరాకరించడంతో బాలీవుడ్ నటిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ముంబైకు చెందిన బాలీవుడ్ సినిమాలత పాటు టీవీ సీరియళ్లలో నటిస్తుంటారు. మార్చి 17న హైదరాబాద్‌ రావాలని ఓ స్నేహితు రాలు ఆహ్వానించింది. నగరంలోని దుకాణం ప్రారంభోత్సవానికి అతిథిగా రావాలని కార్యక్రమంలో పాల్గొన్నందుకు విమానఛార్జీలు, పారితోషికం చెల్లిస్తారని చెప్పింది.ఆమె మాటలు నమ్మి ఈ నెల 18న నగరానికి వచ్చిన సదరు యువతిని మాసబ్ ట్యాంక్‌ శ్యామ్ నగర్ కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్‌లో బస చేశారు.

హైదరాబాద్‌లో యువతి బస చేసిన ఇంట్లో ఉన్న ఓ వృద్ధురాలు నటికి అవసరమైన వసతులు ఏర్పాటు చేశారు. 21వ తేదీన రాత్రి 9 గంటలకు ఇద్దరు మహిళలు నటి ఉన్న అపార్ట్మెంట్‌కు వెళ్లి ఆమెను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. అదే రోజు రాత్రి 11 గంటలకు ముగ్గురు పురుషులు నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఒత్తిడి తెచ్చారు. ఎదురు తిరిగిన ఆమెపై వారు దాడి చేశారు. బాధితురాలు గట్టిగా అరిచి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ముగ్గురు పారిపోయారు.

ఆ తర్వాత వృద్ధురాలు, ఇద్దరు మహిళలు ఆమెను గదిలో బంధించి తన వద్ద ఉన్న రూ.50 వేల నగదు తీసుకుని వెళ్లిపోయారు. బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకుని మాసబ్ ట్యాంక్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ముంబై నటిని ఆహ్వానించిని యువతి కోసం గాలిస్తున్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం