YS Sharmila | ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిలపై తేనె టీగల దాడి
ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఆమెపై తేనె టీగలు దాడి చేశాయి.
నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మెుదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. అయితే షర్మిల పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఓ ఘటన చోటుచేసుకుంది. మోటకొండూరు మండలం నుంచి ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో ఆమెపై తేనెటీగలు దాడి చేశాయి.
ట్రెండింగ్ వార్తలు
దుర్శగానిపల్లి గ్రామం వద్ద చెట్టు కింద గ్రామస్తులతో ఆమె మాట్లడారు. కాసేపటి తర్వాత.. తేనెటీగలు ఒక్కసారిగా పైకి లేచాయి. వైఎస్ షర్మిలపై దాడి చేశాయి. అయితే ఆమె వెంటే ఉన్న సహాయక సిబ్బంది.. వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడి నుంచి.. తప్పించారు. తేనెటీగలు దాడి చేయకుండా.. చేతి రూమాలుతో ఊపారు సిబ్బంది. దీంతో ప్రమాదం తప్పింది. ఇప్పటి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు షర్మిల.
తేనె టీగల దాడి ఘటన తర్వాత.. పాదయాత్రను షర్మిల కొనసాగించారు. రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని ముందుకుసాగుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడుతున్నారు. బుధవారం నాటికి షర్మిల పాదయాత్ర 34వ రోజుకు చేరుకుంది. తెలంగాణ నిరుద్యోగ సమస్యలపై.. షర్మిల ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు.