హైదరాబాద్‌లో అందాల పోటీలపై భజరంగ్‌దళ్‌ అభ్యంతరం.. కారణాలు ఏంటి?-bajrang dal objects to miss world pageant in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్‌లో అందాల పోటీలపై భజరంగ్‌దళ్‌ అభ్యంతరం.. కారణాలు ఏంటి?

హైదరాబాద్‌లో అందాల పోటీలపై భజరంగ్‌దళ్‌ అభ్యంతరం.. కారణాలు ఏంటి?

తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి.. ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందుకే మిస్ వరల్డ్ 2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పోటీల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. రైట్ వింగ్ సంస్థలు ఈ పోటీల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా భజరంగ్‌దళ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.

మిస్ వరల్డ్ 2025

హైదరాబాద్‌లో అందాల పోటీల నిర్వహణపై భజరంగ్‌దళ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరోవైపు భారత్‌, పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం ఉంది. అండగా ఉండాల్సిన వేళ అందాల పోటీలు అవసరమా' అని భజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ శివరాములు ప్రశ్నించారు. దేశ భద్రత కంటే పోటీల నిర్వహణే ముఖ్యమైందా అని వ్యాఖ్యానించారు.

మే 10న ప్రారంభం..

మిస్ వరల్డ్ పోటీలు మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవంతో మొదలవుతాయి. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 116 దేశాల నుండి వచ్చిన అందాల పోటీదారులు ఈ వేడుకలో పాల్గొంటారు. మే 31న ఫైనల్ ఉంటుంది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిష్కోవా.. విజేతకు కిరీటం బహూకరిస్తారు.

ముఖ్యమైన తేదీలు, కార్యక్రమాలు..

మే 10: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభోత్సవం.

మే 12: చార్మినార్, లాడ్ బజార్‌లో హెరిటేజ్ వాక్.

మే 13: చౌమహల్లా ప్యాలెస్ సందర్శన.

మే 14: వరంగల్ కోట, వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం సందర్శన, పేరిణి నృత్య ప్రదర్శన.

మే 15: యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లి పర్యటన.

మే 17: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్.

మే 20-21: టీ-హబ్‌లో ఖండాంతర ఫైనల్స్.

మే 21: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు హాజరు.

మే 22: శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్.

మే 23: ఐఎస్బీలో హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ ఫైనల్.

మే 24: హైటెక్స్‌లో మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫైనల్.

మే 25: జ్యువెలరీ, పెర్ల్ షో.

మే 31: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గ్రాండ్ ఫినాలే ఉంటుంది.

రేవంత్ సమీక్ష..

మిస్ వరల్డ్ 2025 నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిస్ వరల్డ్ 2025 పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ పోటీల ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెప్పేలా ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై కూడా ఆయన సమీక్షించారు. మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాయని అభిప్రాయపడ్డారు.

సంబంధిత కథనం