ఈ నూతన సంవత్సరంలో అరుణాచలేశ్వరుడి దర్శనానికి ప్లాన్ చేస్తున్నారా..? అలాంటి వారికి తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. బస్సు జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ టూరిజం వెబ్సైట్ లోకి వెళ్లి ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలి.
మరోవైపు అరకుకు కూడా తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. కేవలం రూ.6999తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ జనవరి 15, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్డేట్స్ తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం