దసరా వేళ అరుణాచలేశ్వరుడిని దర్శించుకునే భక్తులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా అనంతరం అరుణాచలం వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. HYDERABAD - ARUNACHALAM' పేరుతో ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. 4 రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తారు. వచ్చే అక్టోబర్ నెలలో చూస్తే 14వ తేదీన జర్నీ ఉండనుంది. 12వ తేదీన దసరా పండగ ఉంది. ఈ తేదీ మిస్ అయితే నవంబర్ లో వెళ్లొచ్చు. అందుకు అనుగుణంగా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగానూ అరుణాచలేశ్వరుడి దర్శనానికి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా తక్కువ ధరలోనే ప్యాకేజీని అందించే ఉద్దేశ్యంతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.