దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అరుణాచలం ఒకటి. దీనిన్ని తమిళనాడులో అన్నామలై అని పిలుస్తారు. ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తూ శివలింగంగా భావిస్తారు. అందుకే ఆ కొండ చుట్టు ప్రదక్షిణ చేస్తారు. దీన్నే గిరి ప్రదక్షిణ అంటారు.
ఆశ్వయుజ, కార్తీక మాసాల్లోని పౌర్ణమి రోజుల్లో ఈ గిరి ప్రదక్షిణ చేస్తే కోర్కెలు నెరవేరుతాయని అంటుంటారు. కార్తీక మాసం నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు అధ్యాత్మిక కేంద్రాలకు భక్తులు భారీగా తరలివెళ్తుంటారు. అయితే అరుణాచళేశ్వరుడి దర్శనం కోసం కూడా తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు బయల్దేరుతుంటారు.
కార్తీక మాసం వేళ తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచలం వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. HYDERABAD - ARUNACHALAM' పేరుతో ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువచ్చింది. నాలుగు రోజుల పాటు ట్రిప్ ఉంటుంది.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తారు. ఈ నవంబర్ నెలలో చూస్తే 13వ తేదీన జర్నీ ఉంది. https://tourism.telangana.gov.in/toursList? వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 8000గా ఉంది. చిన్నారులకు రూ. 6400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లోనే పేమెంట్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం