తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వడగాలులు వీస్తున్న కారణం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పగటి పూట ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లొద్దని పేర్కొంది.
తెలంగాణలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు(బుధవారం) ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాలులు పరిస్థితులు అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఎల్లుండి రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈ నెల 25న రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు పరిస్థితులు అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఏపీలో బుధవారం 39 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం-7, విజయనగరం-17, పార్వతీపురం-13, అల్లూరి-2 తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి(గురువారం) 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 18 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వడగాలులు పెరగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ప్రకృతి విపత్తుల కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోంమంత్రి అనిత ఆదేశించాను. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వడగాల్పులు, రాబోయే ముందస్తు వర్షాల నేపథ్యంలో సంసిద్ధతపై సమీక్ష నిర్వహించాను. డ్రైనేజ్, వంతెనలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల వంటి వ్యవస్థల పట్ల గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరివల్లే ఏపీకి విపత్తులు సంభవిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడగాల్పుల పట్ల అవగాహన, అప్రమత్తతకు సంబంధించి గురించి సంబంధిత అన్ని శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు.
సంబంధిత కథనం