తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బాబోయ్, రేపు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు-ap telangana heat wave prevails extreme heat in these districts tomorrow ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బాబోయ్, రేపు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బాబోయ్, రేపు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు క్రాస్ చేశాయి. రానున్న 4 రోజులు తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో రేపు 39 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బాబోయ్, రేపు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు

తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వడగాలులు వీస్తున్న కారణం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పగటి పూట ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లొద్దని పేర్కొంది.

మంగళవారం అధిక ఉష్ణోగ్రతలు

  • ఆదిలాబాద్ -44.3 డిగ్రీలు
  • నిజామాబాద్ -44 డిగ్రీలు
  • మెదక్ -42.8 డిగ్రీలు
  • రామగుండం -42.3 డిగ్రీలు
  • మహబూబ్ నగర్ -41.2 డిగ్రీలు

తెలంగాణ ఠారెతిస్తోన్న ఎండలు

తెలంగాణలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు(బుధవారం) ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాలులు పరిస్థితులు అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఎల్లుండి వాతావరణం

ఎల్లుండి రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఈ నెల 25న రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు పరిస్థితులు అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఏపీలో తీవ్ర వడగాల్పులు

ఏపీలో బుధవారం 39 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం-7, విజయనగరం-17, పార్వతీపురం-13, అల్లూరి-2 తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి(గురువారం) 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 18 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వడగాలులు పెరగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ప్రకృతి విపత్తుల కారణంగా ఒక్క ప్రాణం కూడా పోకూడదు

ప్రకృతి విపత్తుల కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోంమంత్రి అనిత ఆదేశించాను. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వడగాల్పులు, రాబోయే ముందస్తు వర్షాల నేపథ్యంలో సంసిద్ధతపై సమీక్ష నిర్వహించాను. డ్రైనేజ్, వంతెనలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల వంటి వ్యవస్థల పట్ల గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరివల్లే ఏపీకి విపత్తులు సంభవిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడగాల్పుల పట్ల అవగాహన, అప్రమత్తతకు సంబంధించి గురించి సంబంధిత అన్ని శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం