SLBC Dead body: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో మరో మృతదేహం గుర్తింపు.. వెలికితీస్తున్న సహాయ బృందాలు-another body identified in slbc tunnel rescue teams recovering the body ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Slbc Dead Body: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో మరో మృతదేహం గుర్తింపు.. వెలికితీస్తున్న సహాయ బృందాలు

SLBC Dead body: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో మరో మృతదేహం గుర్తింపు.. వెలికితీస్తున్న సహాయ బృందాలు

Sarath Chandra.B HT Telugu

SLBC Dead body: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు గుర్తించాయి. కన్వేయర్‌ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో మృతదేహాన్ని గుర్తించారు. మినీ హిటాచితో మట్టి తీస్తుండగా దుర్వాసన రావడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. అదే ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించి వెలికి తీస్తున్నారు.

ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో మరో మృతదేహాన్ని గుర్తించిన రెస్క్యూ బృందాలు

SLBC Dead body: శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచి కెనాల్‌లో మరో మృతదేహాన్ని గుర్తించారు. సొరంగం పై భాగం కూలిన తర్వాత 16వ రోజు పంజాబ్‌కు చెందిన టిబిఎం ఆపరేటర్‌ మృతదేహాన్ని గుర్తించారు. తాజాగా టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తించారు. బురదలో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికితీసేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

ఎస్‌ఎల్‌బిసిలో సహాయ చర్యల్ని కొనసాగించడంపై సందిగ్ధత కొనసాగుతున్న సమయంలో మృతదేహం కనిపించింది. టన్నెల్‌ కూలిన సమయంలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారిలో ఒక్కరి మృతదేహం మాత్రమే ఇప్పటి వరకు లభ్యమైంది. మంగళవారం రాత్రి మినీ హిటాచీతో మట్టి తవ్వి తీస్తుండగా... మృతదేహం లభ్యమైనట్టు సహాయ బృందాలు వెల్లడించాయి.

కన్వేయర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో డెడ్ బాడీని గుర్తించారు. మృతదేహాన్ని జాగ్రత్తా బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు బయటపడగా మరో ఆరుగురి ఆచూకి తెలియాల్సి ఉంది.

ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద దాదాపు నెలరోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ కొనసాగుతోంది. 32వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో ఆరుగురి మృతదేహాల కోసం తవ్వకాలు కొనసాగించడంపై సందిగ్దత నెలకొంది. టన్నెల్‌లో చివరి 50 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్టు గుర్తించారు.

వాటర్‌ లీకేజీలతో టన్నెల్‌ పైకప్పు కూలిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. టిబిఎం ప్రయాణిస్తున్న మార్గంలో కాకుండా బైపాస్‌ నిర్మించాలనే ప్రతిపాదనపై కూడా చర్చిస్తున్నారు. ఇన్‌లెట్‌, ఔట్‌లెట్‌ను డిజైన్‌ చేసిన మార్గంలో కాకుండా బైపాస్‌లో కలపాలని, దీనికి మూడేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం