ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించింది.
అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 29వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని తాజా ప్రకటనలో పేర్కొంది. https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చని వివరించింది. ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థి సంవత్సర ఆదాయం రూ. 5 లక్షలోపు మాత్రమే ఉండాల్సి ఉంటుందని పేర్కొంది.
NOTE : ఈ లింక్ పై క్లిక్ చేసి అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత కథనం