US Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, రంగారెడ్డి జిల్లాకు చెందిన అత్తా కోడళ్లతో పాటు చిన్నారి దుర్మరణం-a fatal road accident in america three killed from ranga reddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Us Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, రంగారెడ్డి జిల్లాకు చెందిన అత్తా కోడళ్లతో పాటు చిన్నారి దుర్మరణం

US Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, రంగారెడ్డి జిల్లాకు చెందిన అత్తా కోడళ్లతో పాటు చిన్నారి దుర్మరణం

Sarath Chandra.B HT Telugu

US Accident: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన తల్లికూతుళ్లతో పాటు ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన అత్తాకోడళ్లు ప్రాణాలు కోల్పోయారు.

ఫ్లోరిడాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

US Accident: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి చెందారు. అత్తా కోడళ్లతో పాటు ఆరేళ్ల చిన్నారి కూడా ఈ ప్రమాదంలో మృతి చెందడం అందరిని కలిచి వేసింది.

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35) వియ్యపురాలు సునీత రెడ్డి (56)తో పాటు మనుమడు ఆరేళ్ల హర్వీన్‌ రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫ్లోరిడాలో ఈ ప్రమాదం జరిగినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన రోహిత్‌ రెడ్డితో.. ప్రణీతరెడ్డికి వివాహం జరిగింది. ఈ దంపతులకుే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల కుమార్తెను చూసేందుకు అత్త సునీత అమెరికా వెళ్లారు. అత్త సునీతతో కలిసి ప్రణీతరెడ్డి, రోహిత్‌ రెడ్డి, ఇద్దరు పిల్లలు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రణీత, పెద్ద కుమారుడు హర్వీన్, రోహిత్‌ రెడ్డి అత్త సునీత అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రోహిత్‌ రెడ్డితో పాటు వారి చిన్నకుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో రోహిత్ కారు నడుపుతున్నట్టు తెలుస్తోంది.

ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాలను స్వస్థలాలకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం