రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు భారీగా వెల్లువెత్తాయి. కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమల్లోకి వచ్చాక తెలంగాణ సర్కార్… చేపట్టిన మూడు విడతల సదస్సుల్లో 8 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. ఏప్రిల్ 17 నుంచి 30 వరకు నాలుగు మండలాల్లో ముందుగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ తర్వాత రెండో దశ కింద మరో 28 మండలాల్లో దరఖాస్తులను స్వీకరించారు. మూడో విడతగా మిగిలిన మండలాల్లో నిర్వహించారు.