TG EAP CET 2025: తెలంగాణ ఈఏపీ సెట్‌కు 3లక్షల దరఖాస్తులు.. లేట్‌ ఫీతో ఏప్రిల్ 24వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం-3 lakh applications for telangana eap cet opportunity to apply till april 24 with late fee ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Eap Cet 2025: తెలంగాణ ఈఏపీ సెట్‌కు 3లక్షల దరఖాస్తులు.. లేట్‌ ఫీతో ఏప్రిల్ 24వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం

TG EAP CET 2025: తెలంగాణ ఈఏపీ సెట్‌కు 3లక్షల దరఖాస్తులు.. లేట్‌ ఫీతో ఏప్రిల్ 24వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం

Sarath Chandra.B HT Telugu

TG EAP CET 2025: తెలంగాణ ఈఏపీ సెట్‌ 2025 దరఖాస్తులు 3లక్షలు దాటాయి. రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగియగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీలలో దాదాపు 3లక్షల మంది దరఖాస్తు చేశారు. ఏప్రిల్ 24వరకు లేట్‌ఫీతో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తారు.

తెలంగాణ ఈఏపీ సెట్‌ 2025కు 3లక్షల దరఖాస్తులు

TG EAP CET 2025: తెలంగాణ ఈఏపీ సెట్‌ 2025లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2.16 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈఏపీ సెట్‌ కన్వీనర్‌ ఈ ఏడాది దరఖాస్తుల్లో పూర్తి కులం వివరాలను సేకరిస్తారు. మూడు గ్రూపులు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయడనుండటంతో అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేస్తారు.

ఈఏపీ సెట్‌ 2025 దరఖాస్తులను రూ.250 ఆలస్య రుసుంతో బుధవారం వరకు స్వీకరించారు. ఇప్పటివరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2.16 లక్షల మంది దరఖాస్తు చేశారు. అగ్రికల్చర్-ఫార్మసీ విభాగానికి 84 వేల మంది దరఖాస్తు చేశారు. రెండు పరీక్షలకు కలిపి మూడు లక్షల దరఖాస్తులు అందాయి.

ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇంజినీరింగ్ విభాగంలో ఎస్సీ కులాలన్నింటికి కలిపి 25,300, అగ్రికల్చర్ విభాగంలో 21,200 దరఖాస్తులు వచ్చాయి. కులాల వారీగా మాదిగ విభాగంలో ఇంజినీరింగు 13,287(52%), అగ్రికల్చర్‌కు 12,763(60%)້ మంది విద్యార్థులు దరఖాస్తుచేశారు.

కొనసాగుతున్న దరఖాస్తులు స్వీకరణ…

తెలంగాణ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీతో గడువు పూర్తి కాగా... మరోవైపు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. రూ.5 వేలతో ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఏప్రిల్ 14 వరకు రూ. 500 ఆల‌స్య రుసుము నిర్ణయించారు. ఇక ఏప్రిల్ 18 వరకు రూ. 2500 ఫైన్, ఏప్రిల్ 24 వరకు రూ. 5 వేల ఆల‌స్య రుసుము చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఏప్రిల్ 19 నుంచి హాల్‌ టిక్కెట్లు…

తెలంగాణ ఈఏపీసెట్ హాల్ టికెట్లు ఏప్రిల్ 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షల‌ను నిర్వహించనున్నారు. కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తారు.

గత ఏడాది ఇంజినీరింగ్‌కు 2,54,750 మంది దరఖాస్తు చేయగా 2,40,617 మంది పరీక్ష రాశారు. ఈసారి ఏపీ విద్యార్థులకు అవకాశం లేకపోవటంతో అప్లికేషన్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

టీజీ ఈఏపీసెట్ 2025 దరఖాస్తు విధానం…

  • తెలంగాణ ఈఏపీసెట్ - 2025కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • నిర్ణయించిన అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత.. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
  • అప్లికేషన్ పూర్తి చేయటంతో పాటు ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం