WTC Final 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆ రికార్డులపై రహానే కన్ను-wtc final 2023 ajinkya rahane eye on multiple records in wtc final 2023 ind vs aus test ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Wtc Final 2023 Ajinkya Rahane Eye On Multiple Records In Wtc Final 2023 Ind Vs Aus Test

WTC Final 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆ రికార్డులపై రహానే కన్ను

Anand Sai HT Telugu
Jun 01, 2023 06:31 AM IST

Ajinkya Rahane : రహానే ఇప్పుడు WTC ఫైనల్స్ కోసం భారత క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అనేక రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

రహానే
రహానే (twitter)

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ జూన్ 7 నుంచి 11 మధ్య ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో జరగనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్ ఇప్పుడు ఈ జట్టుతో ఫైనల్ ఆడనుంది. ఈ ఫైనల్ కోసం టీమ్ ఇండియా ఇప్పటికే లండన్ చేరుకుంది. మూడో బ్యాచ్‌లో అజింక్యా రహానేతో పాటు కేఎస్ భరత్, శుభ్‌మాన్ గిల్, షమీ, రవీంద్ర జడేజా IPL 2023 ఫైనల్ తర్వాత లండన్ చేరుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడిన అజింక్య రహానే 14 మ్యాచ్‌ల్లో 172.49 స్ట్రైక్ రేట్‌తో 326 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనే రహానెకు మళ్లీ టీమ్ ఇండియాలో అవకాశం వచ్చేలా చేసింది. కాబట్టి రహానే ఇప్పుడు WTC ఫైనల్స్ కోసం భారత క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అనేక రికార్డులను సృష్టించే అవకాశాన్ని పొందాడు.

భారత టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు 4931 పరుగులు చేసిన రహానే ఇంకా 69 పరుగులు చేస్తే టెస్టు క్రికెట్‌లో 5000 పరుగులు పూర్తి చేస్తాడు. టెస్టు క్రికెట్‌లో రహానే 12 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రహానే.. ఇప్పటి వరకు ఆడిన 82 మ్యాచ్‌ల్లో 99 క్యాచ్‌లు పట్టాడు. ఇంకొకటి పట్టుకుంటే 100 క్యాచ్‌లు పూర్తి చేస్తాడు. మొత్తంగా, రహానే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 12,865 పరుగులు చేశాడు. 135 పరుగులతో తన 13,000 పరుగులను పూర్తి చేస్తాడు.

మరోవైపు ఐపీఎల్ తర్వాత.. యువ ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ లో చోటు దక్కింది. తాజా రిపోర్టుల ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మరొకరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌ను రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంచుకున్నారు. ఎందుకంటే గైక్వాడ్‌కు జూన్ 3న వివాహం జరగబోతుంది. ఈ కారణంగా అతడు భారత జట్టుతో జూన్ 5 తర్వాతే కలవనున్నాడు. దీంతో అతడి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వికి అవకాశం కల్పించారు సెలక్టర్లు. స్టాండ్ బై ప్లేయర్స్ లిస్టులో జైస్వాల్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడనున్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్