IND vs SA: టీ20 వరల్డ్ కప్లో టీమ్ ఇండియాకు తొలి షాక్ - సౌతాఫ్రికా చేతిలో ఓటమి
IND vs SA: టీ20 వరల్డ్ కప్లో టీమ్ ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం సౌతాఫ్రికా చేతిలో ఐదు వికెట్ల తేడాతో రోహిత్ సేన ఓటమి పాలైంది.
IND vs SA: టీ20 వరల్డ్ కప్లో ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. స్వల్ప టార్గెట్ను కాపాడుకునేందుకు టీమ్ ఇండియా బౌలర్లు అర్షదీప్సింగ్, షమీ పోరాడినా ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
సూర్యకుమార్ యాదవ్ మినహా మిగిలిన బ్యాట్స్మెన్స్ విఫలం కావడంతో ఇరవై ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి టీమ్ ఇండియా 133 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప టార్గెట్ను ఛేదించేందుకు బరిలో దిగిన సౌతాఫ్రికాకు రెండో ఓవర్లోనే డికాక్ను ఔట్ చేసి షాక్ ఇచ్చాడు టీమ్ ఇండియా పేసర్ అర్షదీప్సింగ్. అదే ఓవర్లో రూసోను పెవిలియన్కు పంపించాడు.
ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న కెప్టెన్ బవుమాను షమీ ఔట్ చేశాడు. 24 రన్స్కే మూడు వికెట్లు కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాను మార్క్రమ్, మిల్లర్ కలిసి ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి సౌతాఫ్రికా స్కోరును వంద పరుగులు దాటించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసిన మార్క్రమ్ ఔటయ్యాడు. 41 బాల్స్లో ఒక సిక్సర్, ఆరు ఫోర్లతో 52 రన్స్ చేశాడు.
మార్క్రమ్ ఔట్ కాగానే మిల్లర్ జోరు పెంచాడు. రెండు ఓవర్లలో 12 పరుగులు చేయాల్సిన తరుణంలో స్టబ్స్ ఔట్ కావడంతో మ్యాచ్పై ఉత్కంఠ ఏర్పడింది. కానీ మిల్లర్ మెరుపులతో సౌతాఫ్రికా విజయాన్ని అందుకున్నది. మిల్లర్ 46 బాల్స్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 59 రన్స్తో నాటౌట్గా మిగిలాడు. టీమ్ ఇండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్కు రెండు వికెట్లు, అశ్విన్, హార్దిక్ పాండ్య, షమీ తలో ఒక వికెట్ తీశారు.