PAK vs ENG T20 World Cup Final: ఫైనల్లో పాక్ బ్యాట్స్మెన్స్ విఫలం - ఇంగ్లాండ్ ముందు ఈజీ టార్గెట్
PAK vs ENG T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించడంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 137 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ ముందు ఈజీ టార్గెట్ను విధించింది.
PAK vs ENG T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 137 పరుగులు మాత్రమే చేసింది. ఫైనల్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ పాకిస్థాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఓపెనర్లు రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజాం నిలకడగా ఆడటంతో పాక్ భారీ స్కోరు చేసినట్లే కనిపించింది.
ట్రెండింగ్ వార్తలు
కానీ 15 పరుగుల వద్ద రిజ్వాన్ ఔటయ్యాడు. ఆ తర్వాత హరీస్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. మసూద్తో కలిసి కెప్టెన్ ఆజాం పాక్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్ బౌలింగ్లో ఆజాం ఔట్ కావడంతో పాకిస్థాన్ కష్టాల్లో పడింది. మిగిలిన బ్యాట్స్మెన్స్ రాణించలేకపోవడంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 137 రన్స్ మాత్రమే చేసింది.
ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగడంతో పాకిస్థాన్ బ్యాట్స్మెన్స్ పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. షాన్ మసూద్ 38, బాబర్ ఆజాం 32, షాబాద్ ఖాన్ 20 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.