Rajeshwari Gayakwad Altercation: సూపర్మార్కెట్లో మహిళా క్రికెటర్ హల్చల్.. స్టాఫ్పై ఫ్రెండ్స్తో కలిసి దాడి
Rajeshwari Gayakwad Altercation: సూపర్మార్కెట్లో మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ హల్చల్ చేసింది. తన సన్నిహితులతో కలిసి అక్కడి స్టాఫ్పై దాడి చేయడం సంచలనం రేపింది.
Rajeshwari Gayakwad Altercation: ఇండియన్ వుమెన్స్ టీమ్ ప్లేయర్ రాజేశ్వరి గైక్వాడ్ ఇన్నాళ్లూ తన ఆటతోనే వార్తల్లో నిలిచింది. కానీ ఇప్పుడు పబ్లిగ్గా ఓ గొడవతో విమర్శల పాలవుతోంది. ఓ సూపర్ మార్కెట్లో మొదలైన చిన్న గొడవ పెద్దదిగా మారింది. చివరికి తన ఫ్రెండ్స్తో కలిసి ఆ మార్కెట్ సిబ్బందిపై దాడి చేసే వరకూ వెళ్లింది.
ట్రెండింగ్ వార్తలు
కర్ణాటకలోని విజయపుర (బీజాపూర్)లో ఈ ఘటన జరిగింది. ఈ గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా వైరల్ అవుతోంది. బీజాపూర్లోని ఓ సూపర్ మార్కెట్లో షాపింగ్కు వెళ్లిన రాజేశ్వరి అక్కడి సిబ్బందితో గొడవ పడింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే కాసేపటికే ఆమె సన్నిహితులు కొందరు మార్కెట్ వచ్చి సిబ్బందిపై దాడి చేశారు.
అక్కడి స్టాఫ్ దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను రిలీజ్ చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే ఆ తర్వాత రాజేశ్వరితోపాటు సూపర్ మార్కెట్ సిబ్బంది సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారు. ఈ గొడవకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు.
రాజేశ్వరి గైక్వాడ్ టీమిండియా క్రికెటర్. ఆమె ఓ లెఫ్టామ్ స్పిన్నర్. 2014లో ఇండియా తరఫున శ్రీలంకపై తన తొలి వన్డే మ్యాచ్ ఆడింది. 2017లో వన్డే వరల్డ్కప్ ఫైనల్ చేరిన ఇండియన్ టీమ్లో రాజేశ్వరి కూడా సభ్యురాలిగా ఉంది. అదే వరల్డ్కప్లో తన అత్యుత్తమ ప్రదర్శన కూడా చేసింది. వుమెన్స్ క్రికెట్ వరల్డ్కప్ చరిత్రలో ఇండియా తరఫున అత్యుత్తమ గణాంకాలు (5/15) నమోదు చేసింది.
టాపిక్