PSL Winners: ప్లాట్లు, ఐఫోన్లు.. పాకిస్థాన్ లీగ్ గెలిచిన లాహోర్ టీమ్కు బంపర్ ఆఫర్
PSL Winners: ప్లాట్లు, ఐఫోన్లతో పాకిస్థాన్ లీగ్ గెలిచిన లాహోర్ టీమ్ పండగ చేసుకుంది. వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన లాహోర్ ఖలందర్స్ కు ఫ్రాంఛైజీ ఓనర్లు ఈ అదిరిపోయే గిఫ్ట్ లు ఇచ్చారు.
PSL Winners: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను వరుసగా రెండోసారి గెలిచిన లాహోర్ ఖలందర్స్ టీమ్ మొత్తానికి ఆ ఫ్రాంఛైజీ ఓనర్లు అదిరిపోయే గిఫ్ట్ లు ఇవ్వడం విశేషం. ప్లేయర్స్ అందరికీ ప్లాట్లు, ఐఫోన్లు ఇచ్చారు. ఈ ఫ్రాంఛైజీ ఓనర్ ఖలందర్స్ సిటీ అనే ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేపట్టింది. దీంతో తమ ప్లేయర్స్ కు అందులోనే ప్లాట్లు ఇచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ ప్లాట్లు, ఐఫోన్లు అందుకున్న వాళ్లలో స్టార్ ప్లేయర్స్ షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, జమాన్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఉన్నారు. ఒక్కొక్క ప్లేయర్ కు 5445 చదరపు అడుగుల ప్లాట్లు ఇచ్చారు. వీటి విలువ పాకిస్థాన్ కరెన్సీలో 92. 5 లక్షలు కాగా.. ఇండియన్ కరెన్సీలో రూ.27 లక్షలు. ఈ లీగ్ మొత్తం ఆడే అవకాశం రాకుండా బెంచ్ కే పరిమితమైన ప్లేయర్స్ కు కూడా ఈ ప్లాట్లు ఇచ్చారు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫైనల్లో లాహోర్ మొదట బ్యాటింగ్ చేసి 200 రన్స్ చేసింది. షాహీన్ షా 44 రన్స్ చేశాడు. ఆ తర్వాత బౌలింగ్ లో రాణించి 4 వికెట్లు తీసుకున్నాడు. లాహోర్ టీమ్ లీగ్ గెలిచినందుకు ఒక ప్లాట్ అందుకున్న షాహీన్.. కెప్టెన్ గా వ్యవహరించినందుకు మరో రెండు అదనపు ప్లాట్స్ కూడా అందుకోవడం విశేషం.
ఈ సీజన్ మొదట్లోనే ఇదే ఖలండర్స్ సిటీలో ఫఖర్ జమాన్, రషీద్ ఖాన్ లకు ప్లాట్లు ఇచ్చారు. ఈ ప్లాట్లతోపాటు అదనంగా ఖరీదైన ఐఫోన్లు కూడా ఈ ఫ్రాంఛైజీ ప్లేయర్స్ అందుకున్నారు. ఈసారి పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్ ను కేవలం ఒక పరుగు తేడాతో లాహోర్ ఖలందర్స్ ఓడించింది. చివరి ఓవర్ వేసిన జమాన్ ఖాన్ కు కూడా ప్రత్యేకమైన బహుమతులు దక్కాయి.
సంబంధిత కథనం
టాపిక్