IPL Brand Value : అమ్మ బాబోయ్.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఇంత పెరిగిందా? జట్లలో సీఎస్‌కే టాప్-ipl brand value sees massive rise chennai super kings no 1 in brand value ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Brand Value : అమ్మ బాబోయ్.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఇంత పెరిగిందా? జట్లలో సీఎస్‌కే టాప్

IPL Brand Value : అమ్మ బాబోయ్.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఇంత పెరిగిందా? జట్లలో సీఎస్‌కే టాప్

Anand Sai HT Telugu

IPL Brand Value : ఐపీఎల్ 2023 బ్రాండ్ వాల్యూ మునుపటి ఎడిషన్‌ల కంటే 80 శాతం పెరిగింది. ఐపీఎల్ 2023 ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ విలువ మిగిలిన జట్ల కంటే టాప్ లో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ(IPL Brand Value) ఈ ఒక్క ఏడాదే బాగా పెరిగింది. సుమారు 80 శాతం ఎక్కువైంది. హౌలిహాన్ నివేదిక ప్రకారం IPL బ్రాండ్ విలువ గత సంవత్సరం 1.8 బిలియన్లు ఉంటే.. ఈ సంవత్సరం 3.2 బిలియన్లకు పెరిగింది. 80 శాతం పెరుగుదల చూసిందన్నమాట. అంటే ఐపీఎల్ బ్రాండ్ విలువ 26,438 కోట్లకు చేరింది.

ఇక జట్ల బ్రాండ్ విలువను పరిశీలిస్తే.. ఐపీఎల్ 2023 సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు ముందు వరుసలో ఉంది. మోస్ట్ బ్రాండ్ వాల్యూ టీమ్ గా నిలిచింది. బిజినెస్ ఎంటర్ ప్రైజ్ వాల్యూ ర్యాంక్సింగ్స్ లోనూ మెుదటిస్థానంలో ఉంది. చెన్నై సూపర్ సూపర్ కింగ్స్ తర్వాత స్థానంలో ఒక్కసారి కూడా కప్పు కొట్టని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఉండటం విశేషం. బ్రాండ్ వాల్యూతోపాటుగా.. ఎంటర్ ప్రైజ్ ర్యాంకింగ్స్ లోనూ ఆర్సీబీ రెండోస్థానంలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ విలువ 212 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ(RCB Brand Value).. 195 మిలియన్ డాలర్లు. 190 మిలియన్ డాలర్లతో ముంబయి ఇండియన్స్ మూడో స్థానంలో ఉండగా.. 181 మిలియన్ డాలర్లతో కేకేఆర్(KKR) నాలుగో స్థానం సొంతం చేసుకుంది. అయితే కిందటి సీజన్ వరకూ ముంబయి బ్రాండ్ వాల్యూ ఎక్కువగా ఉండేది. కానీ ఈ సీజన్ తర్వాత టాప్ ర్యాంక్ గల్లంతు అయింది.

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు ఐదుసార్లు టైటిల్ గెలిచాయి. దీంతో మోస్ట్ బ్రాండ్ వాల్యూ ఉండటం సహజమే. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ జట్టు రెండోస్థానంలో ఉండటం ఆశ్చర్యకరం. బ్రాండ్ వాల్యూ విషయంలో కోహ్లీ(Kohli) క్రేజ్ పనిచేస్తుందని అంటున్నారు కొంతమంది. దీనిపై ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ 2023 సీజన్లో ఆర్సీబీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు. 14 మ్యాచుల్లో ఏడు విజయాలతో ఆరోస్థానంతోనే సరిపెట్టుకుంది. ప్లేఆఫ్స్ చేరిన ముంబయి జట్టు మాత్రం.. క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) చేతిలో ఓడిపోయింది. ఇక గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఐదోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. ధోనీ సారథ్యంతోపాటు జడేజా సూపర్ ఇన్నింగ్స్ ఆ జట్టు బ్రాండ్ వాల్యూను అమాంతం పెంచేశాయని అంటున్నారు.