Thomas & Uber Cup |1979లో సెమీస్...2022లో ఫైనల్...
థామస్ అండ్ ఉబెర్ కప్లో తొలిసారి భారత్ ఫైనల్ లో అడుగుపెట్టింది. సెమీఫైనల్ లో షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్ లు చెలరేగడంతో పటిష్టమైన డెన్మార్క్ పై 3-2 తేడాతో భారత్ విజయాన్ని అందుకున్నది. ఫైనల్ ఫైట్ కోసం ఇండోనేషియాతో భారత్ పోటీపడబోతున్నది.
థామస్ అండ్ ఉబెర్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలిసారి భారత జట్టు ఫైనల్ కు చేరుకొని చరిత్రను సృష్టించింది. శుక్రవారం జరిగిన సైమీఫైనల్ లో డెన్మార్క్ పై 3-2 తేడాతో విజయాన్ని అందుకున్నది ఇండియా. ఈ బ్యాడ్మింటన్ టోర్నీలో 1979లో భారత్ సైమీ ఫైనల్ కు చేరుకున్నది. ఇదే ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.
ట్రెండింగ్ వార్తలు
ఆ రికార్డును యువ షట్లర్ల బృందం అద్వితీయమైన ఆటతీరుతో చెరిపివేశారు. డెన్మార్క్ తో జరిగిన సెమీఫైనల్ లో తొలి మ్యాచ్ లో లక్ష్య సేన్ ఓటమి పాలైన సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్ డబుల్స్ లో సాత్విక్ సాయిరాజు- చిరాగ్ శెట్టి జోడీ అద్భుతంగా ఆడి భారత్ ను ఫైనల్ కు చేర్చారు. 2- 2 తో స్కోరు సమమైన పరిస్థితుల్లో ప్రణయ్ 13-21 21-9 21-12 తో రస్ముస్పై చెలరేగి ఆడి ఇండియాకు గ్రాండ్ విక్టరీని అందించారు.
తొలిసారి భారత్ ఫైనల్ కు చేరుకోవడంతో సంబరాలు అంబరాన్నాంటాయి. పలువురు ప్రముఖులు షట్లర్లకు ప్రశంసలను అందజేస్తున్నారు. ఇప్పటికే సిల్వర్ ఖాయం చేసుకున్న భారత షట్లర్లు గోల్డ్ మెడల్ కోసం ఆదివారం ఇండోనేషియాతో తలపడబోతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్