Aakash chopra on Mayank: ఐపీఎల్ 2023 సీజన్ కోసం శుక్రవారం నాడు వేల జరగనున్న సంగతి తెలిసిందే. కొచ్చి వేదికగా జరిగే ఈ వేలంలో మెరుగైన ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలన్నీ పోటీ పడుతున్నాయి. అయితే గత ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన మయాంక్ అగర్వాల్ కూడా ఈ వేలంలో పోటీ పడుతున్నాడు. పంజాబ్ తరఫున కెప్టెన్గా వ్యవహరించిన మయాంక్.. బ్యాటింగ్లో విఫలం కావడంతో ఆ ఫ్రాంచైజీ అతడిని విడిచిపెట్టింది. దీంతో 2 కోట్ల బేస్ ప్రైజ్తో అతడి వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడి కోసం రెండు జట్లు గట్టిగా పోటీపడతాయని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
"వేలం జాబితాలో మయాంక్ అగర్వాల్ను ఐదో స్థానంలో ఉంచుతున్నాను. అతడిని తీసుకోకపోవడానికి కారణం ఏమైనా ఉందంటే.. చాలా జట్లు ఓపెనర్ లేదా టాపార్డ్ బ్యాటర్ అవసరం లేదు. ఇది తప్ప అతడికి వ్యతిరేకంగా ఏమి లేదు. కాబట్టి గుజరాత్ టైటాన్స్ ఆసక్తి చూపవచ్చు. ఎందుకంటే వారికి శుభ్మన్ గిల్ ఓపెనర్. అతడికి తోడు మరో ఓపెనర్గా వారు మయాంక్ అగర్వాల్ను తీసుకోవచ్చు." అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
మరోపక్క సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ వద్ద ఉన్న సొమ్ముతో విధ్వంకర బ్యాటర్ల కోసం పోటీ పడే అవకాశముందని తెలిపాడు.
"ఎక్కువ మొత్తం సొమ్ముతో మరోసారి సన్రైజర్స్ జట్టు వేలంలోకి రానుంది. ఆ జట్టులో రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్క్రమ్ కాకుండా క్వాలిటీ బ్యాటర్లు లేరు. ఇప్పటికే బౌలింగ్ బలంగానే ఉంది కాబట్టి వారు బ్యాటర్లపై దృష్టి పెట్టవచ్చు. వేలంలో పోటీ పెద్దగా లేకపోతే.. మయాంక్ అగర్వాల్ కోసం వారు 8 నుంచి 10 కోట్ల వరకు ఖర్చు పెట్టే అవకాశముంది." అని ఆకాశ్ చోప్రా అన్నారు.
మయాంక్ అగర్వాల్ గత ఏడాది పంజాబ్ కింగ్స్ తరఫున ఆడటమే కాకుండా కెప్టెన్గానూ వ్యవహరించారు. మయాంక్ బ్యాటర్గా ఘోరంగా విఫలమవడంతో అతడిని పంజాబ్ జట్టు వదులుకుంది. అంతేకాకుండా ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఫ్రాంఛైజీ వదులుకోవడంతో 2 కోట్ల బేస్ ప్రైజ్తో అతడు వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
సంబంధిత కథనం
టాపిక్