హిందువులు మహా శివరాత్రి నాడు పరమేశ్వరుడిని ఆరాధించి, భక్తి శ్రద్దలతో ఉపవాసం, జాగరణ చేస్తారు. శివుడి పూజలో బిల్వపత్రం చాలా ముఖ్యమైనది. శివుడిని ఆరాధించేటప్పుడు బిల్వపత్రాన్ని తప్పక ఉపయోగిస్తారు.
అసలు శివుడికి, బిల్వ పత్రాలకు ఉన్న సంబంధం ఏంటి?, బిల్వ పత్రాలను శివుడికి సమర్పించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? ఇటువంటి విషయాలని తెలుసుకుందాం.
సముద్రమధనం నుంచి వచ్చిన విషాన్ని శివుడు సేవించినప్పుడు శివుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. గొంతు నీలం రంగులోకి మారింది. శరీర ఉష్ణోగ్రత పెరగడం వలన విశ్వం అగ్నికి ఆహుతమయింది. వేడి వలన భూమిపై ఉన్న వారందరూ జీవించడం కష్టంగా మారిపోయింది. సృష్టి ప్రయోజనం కోసం, సృష్టి ప్రయోజనానికి విష ప్రభావాన్ని తగ్గించడానికి దేవతలు శివుడికి బిల్వపత్రాలని సమర్పించారు.
బిల్వపత్యాలను సమర్పించిన తర్వాత విష ప్రభావం తగ్గింది. అందుకని అప్పటి నుంచి శివుడి పూజలో బిల్వపత్రాలని ఉపయోగించడం సాంప్రదాయంగా మారింది. అందుకే శివుడిని ఆరాధించేటప్పుడు తప్పక బిల్వ పత్రాలని అందరూ సమర్పిస్తూ ఉంటారు. శివరాత్రి నాడు శివుడుని ఆరాధించేటప్పుడు శివుడికి బిల్వపత్రాలతో పూజ చేస్తే శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం