వైశాఖ శుక్ల ఏకాదశిని ‘మోహినీ ఏకాదశి’ అని ఎందుకు అంటారు..? శ్రీ హరి విశిష్ట అవతార కథ తెలుసుకోండి!-why vaishaka sukla ekadasi is called mohini ekadashi do you know the stories behind this incarnation ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వైశాఖ శుక్ల ఏకాదశిని ‘మోహినీ ఏకాదశి’ అని ఎందుకు అంటారు..? శ్రీ హరి విశిష్ట అవతార కథ తెలుసుకోండి!

వైశాఖ శుక్ల ఏకాదశిని ‘మోహినీ ఏకాదశి’ అని ఎందుకు అంటారు..? శ్రీ హరి విశిష్ట అవతార కథ తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

రాక్షసుల్ని అంతం చేయాలని విష్ణువు ఎప్పటికప్పుడు అనేక అవతారాలని ఎత్తాడు. కానీ శ్రీహరి అవతారాలు అన్నిట్లో మోహిని అవతారం విశిష్టమైనది. మహావిష్ణువు ఎందుకు మోహిని అవతారం ఎత్తాల్సి వచ్చింది, వైశాఖ శుక్ల ఏకాదశిని ‘మోహినీ ఏకాదశి’ అని ఎందుకు అంటారు అనే గురించి తెలుసుకుందాం.

వైశాఖ శుక్ల ఏకాదశిని ‘మోహినీ ఏకాదశి’ అని ఎందుకు అంటారు (pinterest)

హిందూ మతంలో ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే మంచిది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి ప్రతి నెలా రెండుసార్లు వస్తుంది. ఒకటి కృష్ణ పక్షంలో, మరొకటి శుక్ల పక్షంలో.

వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున, విష్ణువు మోహిని రూపాన్ని పూజిస్తారు. ఇలా ఆరాధించడం వల్ల సకల పాపాలు నశించి మరణానంతరం మోక్షం లభిస్తుంది. ఏకాదశి తిధి మే 07, 2025 ఉదయం 10:19 గంటలకు మొదలవుతుంది. మే 08, 2025 మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. ఈ లెక్కన మే 08న గురువారం నాడు జరుపుకోవాలి.

వైశాఖ శుక్ల ఏకాదశిని మోహినీ ఏకాదశి అని ఎందుకు అంటారు?

రాక్షసుల్ని అంతం చేయాలని విష్ణువు ఎప్పటికప్పుడు అనేక అవతారాలని ఎత్తాడు. కానీ శ్రీహరి అవతారాలు అన్నిట్లో మోహిని అవతారం విశిష్టమైనది. విష్ణువు అందమైన స్త్రీ అవతారాన్ని ఎత్తాడు. కానీ మహావిష్ణువు ఎందుకు మోహిని అవతారం ఎత్తాల్సి వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాం.

మోహినీ ఏకాదశి కథ

రాక్షసులని గందరగోళానికి గురి చేయాలని విష్ణువు మోహిని అవతారం ఎత్తాడు. వాస్తవానికి సముద్రం మథనం చేస్తున్నప్పుడు అమృత కలశం కూడా వివిధ రత్నాలు, విషంతో పాటు కనుగొనబడింది. ఈ కలశాన్ని పొందడానికి దేవతలు, రాక్షసులు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది.

రాక్షసులు అమృత కలశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ విష్ణువు సురక్షితంగా అమృత కలశాన్ని దేవతలకు అందించాడు. దీనిని సురక్షితంగా అందించడానికి మోహిని రూపాన్ని తీసుకున్నాడు. ఆ తర్వత దేవతలు శక్తి, అమరత్వాన్ని పొందారు.

మరో కథ

విష్ణువు మోహిని అవతారానికి సంబంధించి ఇంకో కథ కూడా ఉంది. అదేంటంటే బస్మాసురుడు అనే రాక్షసుడు నుంచి దేవతల్ని రక్షించాలని శ్రీహరి మోహిని అవతారాన్ని తీసుకున్నాడట. మత విశ్వాసాల ప్రకారం, భస్మాసురుడు ఎవరి తలపై అయితే చెయ్యి వేస్తాడో వారు బూడిదగా మారతారట. విష్ణువు మోహిని అవతారం తీసుకున్నాడు. భస్మాసురుడుని నాట్యం చేయమని మోహిని అడుగుతుంది. మోహినితో నాట్యం చేయడానికి భస్మాసురుడు అంగీకరిస్తాడు.

మోహిని ఎలా నాట్యం చేస్తోందో అచ్చం అలానే నాట్యం చేయడం మొదలు పెడతాడు. నాట్యం చేస్తున్నప్పుడు మోహిని తన తలపై చెయ్యి వేసుకుంటుంది. అది చూసి భస్మాసురుడు కూడా అలానే తన తలపై చెయ్యి వేసుకుంటాడు. దీనితో భస్మాసురుడు బూడిదగా మారిపోయాడు. ఇలా విష్ణువు మోహిని అవతారం ద్వారా భస్మాసురుడు నాశనం అవుతాడు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.