Karthika snanam: కార్తీక మాసంలో నదీ స్నానం ఎందుకు చేయాలి? దీని విశిష్టత ఏంటి?-why take a river bath in the month of kartika what is special about it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karthika Snanam: కార్తీక మాసంలో నదీ స్నానం ఎందుకు చేయాలి? దీని విశిష్టత ఏంటి?

Karthika snanam: కార్తీక మాసంలో నదీ స్నానం ఎందుకు చేయాలి? దీని విశిష్టత ఏంటి?

HT Telugu Desk HT Telugu

Karthika snanam: కార్తీక మాసంలో ఒక్కసారైనా నదీ స్నానం ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక స్నానం ఎందుకు చేయాలి? దీని వల్ల కలిగే పుణ్య ఫలితాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.

కార్తీక మాసంలో పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడం పుణ్య ఫలాన్ని ఇస్తుందని విశ్వాసం (Rameshwar Gaur)

కార్తీక స్నానం ఒక పవిత్ర ఆచారము. ఇది మన శరీరానికి శుభ్రతను, మనస్సుకు శాంతిని అందిస్తుంది. కార్తీక మాసంలో ప్రతి రోజు స్నానం, పూజలు, దీపారాధనలు చేయడం ద్వారా భక్తులు భగవంతుని కృపతో ఆరోగ్యకరమైన జీవితం, సుఖశాంతి, సంపదలు పొందవచ్చు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.

కార్తీక మాసంలో ప్రతి రోజు చేసే స్నానాలు, దీపారాధనలు, పూజలు భక్తుల ఆధ్యాత్మిక ప్రగతికి, శ్రేయస్సుకు దోహదపడతాయి. కార్తీక మాసంలో స్నానం చేయడం ద్వారా పాప విముక్తి, ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయని చిలకమర్తి తెలిపారు. సాధారణంగా కార్తీక మాసంలో శివుడు, విష్ణువు ఇతర దేవతల పూజ విశేషమైనదిగా పరిగణిస్తారు. ఈ మాసంలో భగవంతుని పూజకు, ప్రత్యేకంగా స్నానం చేసి పూజించడం ద్వారా భక్తులు పాప విముక్తిని పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసం గంగా స్నానానికి ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది. అయితే సాధారణ స్నానం కూడా భక్తి, శ్రద్ధతో చేస్తే పుణ్యం లభిస్తుంది.

స్కంద పురాణం, విష్ణు ధర్మ శాస్త్రాలు, ఇతర హిందూ గ్రంథాల్లో కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయని, లోకాలను జయించి జీవితం సాఫల్యం పొంది శివ అనుగ్రహం పొందుతారని వివరణ ఇవ్వబడింది. కార్తీక మాసంలో ప్రతి రోజు తెల్లవారుజామున స్నానం చేసి దేవాలయ దర్శనం చేయడం, శివుడికి గంగా జలం, పాలు సమర్పించడం ద్వారా కలిగే పుణ్యాలు అన్నీ మనిషి జీవన ప్రగతికి దోహదపడతాయని చిలకమర్తి తెలిపారు.

స్నాన విధానం

1. ఉదయం స్నానం: కార్తీక మాసంలో ఉదయం, ముఖ్యంగా తెల్లవారుజామున స్నానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక పవిత్రత పొందవచ్చు. స్నానం తరువాత శివుడు, విష్ణువు పూజ చేయడం ద్వారా వారి కృప అందిస్తారని నమ్మకమని చిలకమర్తి తెలిపారు.

2. పవిత్ర నదులు: గంగ, యమునా, గోదావరి, కృష్ణా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం మరింత పుణ్యప్రదం. నదులకు వెళ్లలేనివారు ఇంట్లోనే గంగా జలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చు.

3. స్నానం తరువాత పూజా కర్మలు: స్నానం తరువాత శివుడికి బిల్వ దళాలు, పూలు సమర్పించి, దీపారాధన చేయడం విశేషం. విష్ణువు పూజ కూడా చేయవచ్చు, దీనివల్ల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేసారు.

కార్తీక స్నానం చేసే పుణ్యఫలాలు

1. పాప విముక్తి: పురాణాల ప్రకారం కార్తీక మాసంలో స్నానం చేయడం ద్వారా పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయి. పాప విముక్తి పొందడమే కాకుండా భవిష్యత్ పాపాలు కూడా చేర్చకపోవడానికి కార్తీక స్నానం తోడ్పడుతుంది.

2. ఆరోగ్య సౌఖ్యం: స్నానం ద్వారా శరీరంలోని చెడు వాయువులు తొలగిపోతాయి, ఇది ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. హిందూ సంప్రదాయంలో ప్రతి రోజు స్నానం చేయడం శుభప్రదంగా ఉంటుందని, కార్తీక మాసంలో చేయడం మరింత శుభప్రదం.

3. ఆధ్యాత్మిక శ్రేయస్సు: కార్తీక స్నానం ఒక ధార్మిక పద్దతి కాబట్టి, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఇది ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. కార్తీక మాసం పుణ్య ఫలితాలు అన్నీ ఆధ్యాత్మిక ఉద్ధరణకు దోహదం చేస్తాయి.

కార్తీక మాసంలో స్నానం తరువాత పూజకు దీపారాధన కలపడం అనేది ఎంతో విశిష్టమైన పద్దతి. కార్తీక దీపం వెలిగించడం వల్ల ఆత్మీయ శ్రేయస్సు, సుఖశాంతులు కలుగుతాయని విశ్వసిస్తారు. సాయంత్రం సమయం వచ్చే సరికి దీపారాధన చేయడం వల్ల అనేక దైవానుగ్రహాలు లభిస్తాయి. దీపం వెలిగించడం, దీపముక్కల ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక అనుభవం పొందవచ్చు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు.