విష్ణువు అవతారమైన పరశురాముడిని ఎందుకు పూజించరు? కారణం ఏంటో తెలుసా?-why parashurama is not worshipped even though he is an incarnation of vishnu check the reason ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  విష్ణువు అవతారమైన పరశురాముడిని ఎందుకు పూజించరు? కారణం ఏంటో తెలుసా?

విష్ణువు అవతారమైన పరశురాముడిని ఎందుకు పూజించరు? కారణం ఏంటో తెలుసా?

Peddinti Sravya HT Telugu

విష్ణువు ప్రతి అవతారం విశ్వానికి మేలు చేసింది. విష్ణు అవతారాల్లో పరశురాముని అవతారం కూడా ఒకటి. పరశురాముని అవతారం విష్ణువు ఆరవ అవతారంగా పరిగణించబడింది. అయినా పరశురాముడికి ఎందుకు పూజలు చేయరు? కారణం ఏంటో తెలుసా?

విష్ణువు అవతారమైన పరశురాముడిని ఎందుకు పూజించరు? (pinterest)

విష్ణువు 10 అవతారాల్లో పరశురామ అవతారం కూడా ఒకటి. పరశురాముడు ఇప్పటికీ భూమిపై నివసిస్తున్నాడని పురాణ కథనం. పరశురాముడుని ఎక్కడా ఎవరూ పూజించరు. పరశురాముడికి ఎందుకు పూజలు చేయరు? పరశురాముల స్వభావం, జీవితం గురించి ఈరోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

విష్ణువు విశ్వానికి రక్షకుడు. విశ్వాన్ని రక్షించడానికి వివిధ అవతారాలలో దర్శనమిచ్చారు. విష్ణువు ప్రతి అవతారం విశ్వానికి మేలు చేసింది. విష్ణు అవతారాల్లో పరశురాముని అవతారం కూడా ఒకటి.

పరశురాముని అవతారం విష్ణువు ఆరవ అవతారంగా పరిగణించబడింది. అన్ని అవతారాల్లో ఉన్న విష్ణువుని ఆరాధించినప్పటికీ పరశురామ అవతారాన్ని ఎందుకు పూజించరు?, విష్ణువు పరశురామ అవతారాన్ని ప్రజలు పూజించకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం.

పరశురాముని స్వభావం

హిందూమతంలో అమరత్వం అనే వరాన్ని పొందిన ఏడుగురు అమరుల్లో పరశురాముడు ఒకరు. జమదగ్ని ఋషి కుమారుడు. పరశురాముడు విష్ణువు యొక్క ఉద్వేగభరితమైన అవతారం. ఋషి కుమారుడైనప్పటికీ పరశురాముడికి అపారమైన కోపం ఉండేది.

పరశురాముడు నేటికీ ఉన్నారు

విష్ణువు తీసుకున్న అవతారాలు అన్నీ భూమిని విడిచిపెట్టినా పరశురాముడు మాత్రం ఇంకా ఉన్నారని నమ్ముతారు. అయితే పరశురామ అవతారంలో ఉన్న విష్ణువు ఇంకా భూమి మీద ఉన్నప్పటికీ పూజలు చేయరు.

ఎందుకు పరశురాముడని పూజించరు?

పరశురాముడు విష్ణువు యొక్క భయంకరమైన, ఉగ్రమైన అవతారం. పరశురాముదుని ఆరాధిస్తే మరింత శక్తి, బలం లభిస్తాయి. సామాన్య మానవులు పరశురాముని శక్తిని నియంత్రించలేరు. అందుకని చాలామంది పరశురాముడిని పూజించరు. ఆయన శక్తిని నియంత్రించాలంటే, ఆయనతో సమానమైన శక్తి ఉండాలి. అందుకే పరశురాముడుని పూజించరు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం