Vishnu: విష్ణువు 'వరాహ అవతారం' ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, రాక్షసులు వలన కలిగిన నష్టం ఏంటి? దీని వెనుక ఇంత కథ ఉందా?
Vishnu: మొత్తం 52 అవతారాలు ఎత్తారు. ఈ విషయం విష్ణు పురాణంలో కూడా ఆ పేర్కొనబడింది. అయితే, విష్ణువు మూడవ అవతారమైనటువంటి వరాహవతారం గురించి ఈరోజు తెలుసుకుందాం.
విష్ణుమూర్తి ని శ్రీహరి అని కూడా అంటారు. ఆయన ఈ విశ్వానికి దర్శకుడిగా పరిగణించబడ్డారు. భూమిపై మానవత్వం కోల్పోయినప్పుడల్లా పాపాలు, దురాగతాలు హద్దులు దాటి పెరిగినప్పుడు విష్ణువు అవతరించి, ప్రజల్ని రక్షించారని అందరూ నమ్ముతారు. ఆయన మొత్తం 52 అవతారాలు ఎత్తారు. ఈ విషయం విష్ణు పురాణంలో కూడా ఆ పేర్కొనబడింది. అయితే, విష్ణువు మూడవ అవతారమైనటువంటి వరాహవతారం గురించి ఈరోజు తెలుసుకుందాం.
సంబంధిత ఫోటోలు
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Feb 14, 2025, 08:05 AMGuru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 14, 2025, 06:15 AMఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Feb 13, 2025, 08:09 AMRahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
విష్ణు పురాణం ప్రకారం ఒకప్పుడు భూమిపై హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే ఇద్దరు శక్తివంతమైన రాక్షసులు ఉండేవారు. వీళ్ళు చాలా బలంగా ఉండేవారు. అనేక దేవతల నుంచి ఆశీర్వాదం పొందాక తమని తాము అజయంగా భావించడం మొదలుపెట్టారు. లోక రక్షకుడైన విష్ణువుని తన ముందు చిన్న చూపుగా భావించడం మొదలుపెట్టారు. ఆయనను దూషించి మాట్లాడేవారు.
హిరణ్యాక్షుడు భూమిని అపహరించాడు. ఒకసారి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన శక్తి పొందిన వరాల మత్తులో భూమిని అపహరించాడు. మంత్రశక్తిని ఉపయోగించి భూమిని పాతాళంలోకి తీసుకెళ్లాడు. పాతాళంలోని భూమిని ఉంచాడు. ఇలా చేయడం వలన తనను తాను విశ్వంలో అత్యుత్తమంగా నిర్మించుకోవాలనుకున్నాడు. హిరణ్యాక్షుడు భూమిని అపహరించడం వలన జనజీవనం చిన్నాభిన్నమయింది. ఇది చూసి దేవతలు కూడా కలవరపడ్డారు.
విష్ణుమూర్తి వరాహ అవతారం
ఈ సమస్యకి పరిష్కారం లేదని దేవతలందరూ సమావేశమై బ్రహ్మదేవుడు వద్దకు వెళ్లి మానవాళిని రక్షించమని వేడుకున్నారు. విష్ణువు బ్రహ్మదేవుని ముఖం నుంచి వరాహ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అతని ఎత్తు 8 అంగుళాలు. కానీ తక్కువ సమయంలో అతను భారీ రూపాన్ని పొందాడు. అతని ముఖం పంది ముఖంగా మారింది. మెడ కింద శరీరం మనిషిగా ఉంది.
ఈ విచిత్రమైన శక్తివంతమైన రూపాన్ని చూసిన దేవతలు ప్రపంచాన్ని రక్షించబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఋషులు, సాధువులందరూ పూల వర్షం కురిపించి పూజలు చేశారు. తన ముక్కు సహాయంతో హిరణ్యక్షుడు భూమిని ఎక్కడ దాచి ఉంచాడో కనుగొన్నాడు. తర్వాత వరాహ అవతారంలో విష్ణువు భూమిని తిరిగి తీసుకురావడానికి పాతాళలోకానికి చేరుకున్నప్పుడు హిరణ్యాక్ష రాక్షసుడు అతన్ని చూసి సవాల్ చేశాడు.
హిరణ్యాక్షుడి మరణం
మహా విష్ణువు, హిరణ్యక్షుడు మధ్య భీకర యుద్ధం జరిగింది. హిరణ్యాక్షుడు తన మంత్ర, ఆయుధాలు అన్నిటిని శ్రీహరి పై ప్రయోగించాడు. కానీ అది అతనిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. యుద్ధం చాలా కాలం కొనసాగిన తర్వాత వరాహ అవతారంలో ఉన్న విష్ణువు హిరణ్యక్షుడిని చంపారు.
భూమిని బయటకు తీసుకువచ్చారు. దేవతలు ఋషులు పూల వర్షం కురిపించి విష్ణువుకు స్వాగతం పలికారు. అది మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి. ఆరోజు ఉపవాసం ఉండి నీరు త్రాగి, ద్వాదశి నాడు అదే నీటిలో తన శరీరాన్ని వదిలేసి వైకుంఠానికి వెళ్లిపోయారు. అతను తన శరీరాన్ని విడిచిపెట్టిన నీటిని ఆది గంగ అని అంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం