Lord Vishnu: విష్ణువు కూర్మావతారం ఎందుకు తీసుకోవలసి వచ్చింది? దేవతల జీవితాలు ప్రమాదంలో పడడానికి కారణం ఏంటి?
Lord Vishnu: ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కున్నప్పుడల్లా ఆయన మానవాళిని రక్షించడానికి, మతాన్ని తిరిగి స్థాపించడానికి భూమిపైకి వచ్చారు. పౌరాణిక గ్రంథాలలో ఆయన యొక్క 52 అవతారాల ప్రస్తావన ఉంది. ముఖ్యంగా రెండవ అవతారమైన కూర్మావతారం గురించి చూద్దాం.
విష్ణుమూర్తిని చాలా మంది ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటారు. విష్ణువు అనుగ్రహం కలగడానికి ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటారు. శ్రీమహావిష్ణువు మహిమ అపరిమితమైనది, అనంతమైనది. ప్రపంచాన్ని విష్ణువు నడిపిస్తారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కున్నప్పుడల్లా ఆయన మానవాళిని రక్షించడానికి, మతాన్ని తిరిగి స్థాపించడానికి భూమిపైకి వచ్చారు. పౌరాణిక గ్రంథాలలో ఆయన యొక్క 52 అవతారాల ప్రస్తావన ఉంది. ముఖ్యంగా రెండవ అవతారమైన కూర్మావతారం గురించి చూద్దాం.
సంబంధిత ఫోటోలు
Feb 17, 2025, 12:25 PM43 రోజుల పాటు ఈ రాశులకు మెండుగా అదృష్టం.. ఆర్థికంగా, మానసికంగా ప్రయోజనాలు!
Feb 17, 2025, 09:40 AMVenus Transit: పూర్వాభాద్ర నక్షత్రంలో శుక్రుడు.. ఈ 3 రాశులకు అదృష్టం, కొత్త అవకాశాలు, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 17, 2025, 06:00 AMఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు! భారీగా ధన లాభం, అన్ని కష్టాలు దూరం..
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
దుర్వాస మహర్షి శాపం
నరసింహ పురాణం ప్రకారం చూసినట్లయితే దేవతలు మహిమ, శక్తి గురించి గర్వపడ్డారు. వారు తమ శక్తులతో మునిగిపోయారు. ఏ ఋషిని లేదా సాధువుని లెక్క చేయలేదు. మహర్షి దుర్వాసుడు ఒకసారి పారిజాత పుష్పాల దండను సిద్ధం చేసి ఇంద్రుడికి సమర్పించాడు. గర్వంతో మునిగిపోయిన ఇంద్రుడు ఆ మాల ధరించకుండా ఏనుగు తలపై పెట్టాడు. ఏనుగు దండని పాదాల కింద పెట్టి నలిపేసింది. అది చూసిన దుర్వాస మహర్షికి కోపం వచ్చి, దేవతలని వారి శక్తి అంతరించిపోవాలని శపించాడు.
దుర్వాస మహర్షి శాప ప్రభావం వలన దేవతలందరూ శక్తిహీనులయ్యారు. తేజస్సు, శ్రేయస్సు నిలిచిపోయాయి. దేవతలు వారిపై దాడి చేయడం ప్రారంభించారు. వారు శక్తిని కోల్పోవడం వలన దేవతలు పూర్తిగా శక్తిహీనులయ్యారు. అందుకని వారు పోరాడలేకపోయారు. దీంతో దుఃఖించిన దేవతలు ఒక చోట చేరి, విష్ణువుని శరణు వీడారు.
విష్ణువు సహాయం
దేవతలు విష్ణువుతో తమ బాధను చెప్పుకునే సహాయం కోరారు. వారు విన్నపాన్ని విన్న మహా విష్ణువు సముద్ర మథనం చేయమని కోరారు. సముద్ర మథనం నుంచి అమృతం కలశం బయటకు వస్తుంది. దానిని సేవిస్తే దేవతలు అమరులవుతారు. శక్తులు తిరిగి పొందవచ్చని విష్ణుమూర్తి చెప్పారు. కానీ దేవతలు మాత్రమే సముద్ర మథనం చేయలేరు. కనుక బృహస్పతి సలహా మేరకు రాక్షసుల్ని కూడా ఈ సముద్ర మథనంలో పాల్గొనమని ఒప్పించారు.
అమృత కలశం బయటకు వచ్చాక, దానిని సమానంగా పంచుకుంటారని రాక్షసులకి ప్రతిపాదించాడు. తర్వాత పరస్పర అంగీకారంతో మందరాచల పర్వతాన్ని సముద్ర మథనం కోసం మార్చారు. నాగరాజు వాసుకిని తాడుగా ఉపయోగించారు. తర్వాత దేవతలు, రాక్షసులు నాగరాజు వాసుకిని మందరాచల పర్వతాన్ని చుట్టి సముద్రాన్ని మధనం చేయడం మొదలుపెట్టారు. కానీ పర్వతం పెద్ద పరిణామం, బరువు వలన అది సముద్రంలో మునిగిపోబోతోంది. దీంతో ఈ ప్రక్రియ సందిగ్ధంలో పడింది.
కూర్మావతారం
విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తుతాడు. పర్వతం వేగంగా తిరుగుతూ కొంతకాలం తర్వాత సముద్ర మథనం పూర్తయింది. తర్వాత అమృత కలశాన్ని తీస్తారు. ఇంద్రుని కుమారులు లాక్కుని పారిపోవడం మొదలుపెట్టారు. వారి వెంట రాక్షసులు పరిగెత్తారు. హడావిడలో దేవతలు అమృతాన్ని సేవించారు. దాంతో మళ్లీ దైవకశక్తిని, ఆనందం, శ్రేయస్సు పొందుతారు. విష్ణువు సహాయం చేయకపోతే సముద్ర మధనం ఎప్పటికీ సాధ్యం కాదు.
కూర్మ జయంతి
కూర్మ జయంతిని వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈరోజున మహా విష్ణువు సముద్రాన్ని మథనం చేయడంలో దేవతలు, రాక్షసులకు సహాయం చేయడానికి కూర్మావతారం తీసుకున్నారని చెప్పారు. ఈ సముద్ర మథనం వలన లక్ష్మీదేవి, కాలకూట అనే విషం, అమృతంతో సహా 14 రత్నాలు లభించాయి. ఈ కారణంగానే తాబేలుని కూడా విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం