చాలా మంది హిందువులు ప్రతీ సంవత్సరం చార్ ధామ్ యాత్రకు వెళ్తూ ఉంటారు. హిందువులు అత్యంత పవిత్రంగా పరిగణించే యాత్ర ఇది. ఉత్తరాఖండ్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల సందర్శనను చార్ ధామ్ యాత్ర అని అంటారు. ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు చార్ ధామ్ యాత్రకు వెళ్తారు. అక్కడ ఉన్న పరమేశ్వరుడుని దర్శించుకుంటారు. చాలా మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కేదార్నాథ్ కి వెళ్తూ ఉంటారు.
ఉత్తరాఖండ్ లో ఉన్న రుద్రప్రయోగ జిల్లా కేదార్ఘటిలో కేదార్నాథ్ ఆలయం ఉంది. పాండవ వంశస్తుడైన జనమేజయుడు దీనిని నిర్మించాడని చరిత్ర ప్రకారం తెలుస్తోంది. అయితే, ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం ఎంతో పురాతనమైనది. ఆది గురువు శంకరాచార్య కేదార్నాథ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. రాళ్లు, దేవదారు చెక్కపై అందమైన శిల్పాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
వారిని కలవడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. పాండవులు కేదార్ఘటి వద్దకు వచ్చినప్పుడు శివుడు ఎద్దులా మారిపోయి పశువుల మందలో కలిసిపోయాడు. అయితే, శివుడు పశువుల మందలో కలిసిపోయినట్లు ఆకాశవాణి ద్వారా పాండవులు శివుడు అక్కడ ఉన్న విషయాన్ని తెలుసుకుంటారు.
రెండు పర్వతాల మధ్య కాళ్లు చాచి దేవుడు భీముడు శివుడిని వెతుకుతాడు. అప్పుడు ఆవులు అన్నీ భీముని పాదాల కింద నుంచి వెళ్ళిపోతాయి. శివుడు మాత్రం వెనక్కి తిరిగి నిలబడతాడు. శివుడు దగ్గరికి భీముడు వెళ్లగా శివుడు మంచులో కూరుకుపోయాడు. అప్పుడు భీముడు మూపురం భాగాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అక్కడ శిలగా ఉండిపోయింది.
ఆ భాగాన్ని కేదార్ నాథ్ లో ఇప్పుడు పూజిస్తారు. అందుకనే ఈ శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది. తలభాగం మంచులో కూరుకుపోతుంది. అది హిమాలయాలకు అటువైపు ఉంటుంది. అది ఖాట్మాండు (నేపాల్) లో ఉంది. అందుకనే చాలా మంది నేపాల్ వెళ్లి పశుపతినాథ్ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు.
కేదార్నాథ్ ఆలయానికి వెళ్లి పరమేశ్వరుడుని దర్శించుకుంటే రోగాలు, దోషాలు, పాపాలు అన్నీ తొలగిపోతాయట. సత్యయుగంలో నారాయణ ఋషి శివుడు కోసం తపస్సు చేయగా.. శివుడు జ్యోతిర్లింగ రూపంలో కేదార్ నాథ్ లో దర్శనమిచ్చాడు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.