జగన్నాథుని రథయాత్రను ఎందుకు జరుపుతారు, దీని వెనుక కారణం ఎవరు? పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి!-why jagannath ratha yatra will be held check the reason behind this based on puranas ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జగన్నాథుని రథయాత్రను ఎందుకు జరుపుతారు, దీని వెనుక కారణం ఎవరు? పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి!

జగన్నాథుని రథయాత్రను ఎందుకు జరుపుతారు, దీని వెనుక కారణం ఎవరు? పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

ప్రతి ఏటా ఆషాఢ మాసం శుక్లపక్షం రెండవ రోజు రథయాత్రను ఘనంగా జరుపుతారు. జగన్నాథుడితో పాటుగా సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర కలిసి రథాలపై పర్యటిస్తారు. ఈ అద్భుతమైన రథయాత్రను వీక్షించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ రథయాత్రను చూసినట్లయితే 1000 యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుంది.

జగన్నాథ్ ఆలయం

పూరిలో నిర్వహించే రథయాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి జగన్నాథ రథయాత్రలో పాల్గొంటారు. ఒరిస్సా లో ఉన్న పూరీలో జగన్నాథుని ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా ఆషాఢ మాసం శుక్లపక్షం రెండవ రోజు రథయాత్రను ఘనంగా జరుపుతారు. జగన్నాథుడితో పాటుగా సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర కలిసి రథాలపై పర్యటిస్తారు.

ఈ అద్భుతమైన రథయాత్రను వీక్షించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ రథయాత్రను చూసినట్లయితే 1000 యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుంది. ఇదంతా పక్కన పెడితే, అసలు రథయాత్రను ఎందుకు జరుపుతారు? జగన్నాథుని రథయాత్ర వెనుక ఉన్న పురాణ కథలకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

ఎందుకు రథయాత్రను జరుపుతారు?

పురాణాల ప్రకారం చూసినట్లయితే, సుభద్ర దేవి నగరాన్ని చూడాలని అనుకుంటుంది. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రతో కలిసి రథంపై కూర్చుని పర్యటన మొదలు పెడతారు. జగన్నాథుని అత్త గుండిచా దేవి దగ్గరకు వెళ్తారు. ఏడు రోజులు అత్త దగ్గర విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. కృష్ణుడు చేసిన ఆ యాత్రే జగన్నాథ రథయాత్ర అని అంటారు. ఇలా అప్పటి నుంచి ఇది ఆచారంగా మారిందని అంటారు.

మరో కథనం

రథయాత్ర వెనుక మరో కథనం కూడా ఉంది. అదేంటంటే, వేదవ్యాసుడు కృష్ణుడుని.. "నీ భక్తులకు దర్శనం ఇవ్వమని" ప్రార్థిస్తాడు. దీనికి సమాధానంగా జగన్నాథుడు రథయాత్రను నిర్వహిస్తాడు. రథయాత్ర అంటే జగన్నాథుడిని చూసి తన భక్తులు ఆనందించడానికి మార్గం అని అంటారు. ఆనాటి నుంచి ఇలా రథయాత్ర నిర్వహిస్తున్నారని కూడా చెబుతారు.

నారదుడు చెప్పినట్టు

మరో పురాణం ప్రకారం చూసినట్లయితే, కృష్ణుని భార్యలు రాసలీల కథలను చెప్పమని బలరాముడు తల్లి రోహిణిని అడగగా.. అప్పుడు రోహిణి, కృష్ణుడితో "సుభద్ర ఈ కథలు వినకూడదు" అని అంటుంది. అందువల్ల కృష్ణుడు తన సోదరుడు బలరాముడు, సుభద్రను తీసుకుని రథయాత్రకు వెళ్లడం జరుగుతుంది. ఇలా రథం మీద వెళ్తున్నప్పుడు నారదుడు కనిపిస్తాడు.

వారు ముగ్గురు ఇలా ప్రయాణం చేయడం చూసి సంతోషపడతాడు. అప్పుడు భక్తులకు ప్రతి ఏటా ముగ్గురు ఇలా దర్శనం ఇవ్వాలని కృష్ణుడితో నారదుడు చెప్తాడు. ఈ అభ్యర్థనకు కృష్ణుడు ఒప్పుకుంటాడు. అందుకే అప్పటినుంచి రథయాత్ర నిర్వహిస్తున్నారని అంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.