Puri Jagannatha temple: జగన్నాథ విగ్రహం ముఖం మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? దీని వెనుక కారణం ఏంటి?-why jagannath idol only his face what is the reason behind this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Puri Jagannatha Temple: జగన్నాథ విగ్రహం ముఖం మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? దీని వెనుక కారణం ఏంటి?

Puri Jagannatha temple: జగన్నాథ విగ్రహం ముఖం మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? దీని వెనుక కారణం ఏంటి?

Gunti Soundarya HT Telugu
Jul 08, 2024 12:19 PM IST

Puri Jagannatha temple: జగన్నాథ ఆలయంలోని విగ్రహాలు కేవలం ముఖం మాత్రమే కనిపిస్తుంది. అలా ఎందుకు కనిపిస్తుంది, దీని వెనుక పురాణ కథలు ఏంటో తెలుసుకుందాం.

జగన్నాథ విగ్రహాల ఊరేగింపు
జగన్నాథ విగ్రహాల ఊరేగింపు (AFP)

Puri Jagannatha temple: ఎన్నో వింతలు విశేషాలతో నిలయంగా జగన్నాథ ఆలయం అంటుంది. ఇప్పటికి ఈ ఆలయానికి సంబంధించి కొన్ని విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి.  వాటిలో జగన్నాథుడి విగ్రహం ఒకటి. 

yearly horoscope entry point

సాధారణంగా ఏ ఆలయంలోనైనా దేవతలు, దేవుళ్ళ విగ్రహాలు పూర్తిగా ఉంటాయి.  అయితే పూరి జగన్నాథ దేవాలయంలో కనిపించే విగ్రహాలు మాత్రం మిగతా వాటికంటే భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ జగన్నాథుడు మొత్తం శరీరంతో కాకుండా కేవలం పెద్ద కళ్ళతో గుండ్రని మొహంతో మాత్రమే కనిపిస్తాడు. అలా ఎందుకు ఉంటుంది? స్వామివారి పూర్తి రూపం ఎందుకు ఉండదు? అనే దానికి సంబంధించి అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వినిపించే కారణాలు ఇవి. 

రాజు కల పూర్తి కాని విగ్రహం 

పురాణాల ప్రకారం ఇంద్రయుమ్న రాజు విష్ణువు భక్తుడు. అత్యంత ప్రత్యేకమైన పవిత్రమైన విగ్రహంతో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నాడు. కలలో దేవుడు కనిపించి తన పరిపూర్ణ రూపాన్ని కనుగొనమని చెప్పాడు. రాజు విగ్రహ నిర్మాణం కోసం శిల్పి విశ్వకర్మ సహాయం కోరాడు. అయితే పని పూర్తయ్యే వరకు ఎవరూ తనని ఇబ్బంది పెట్టకూడదనే షరతుతో విగ్రహాన్ని చెక్కేందుకు విశ్వకర్మ అంగీకరించాడు. 

విగ్రహం తయారీకి సంబంధించి ఎటువంటి వివరాలు తెలియకపోవడంతో రాణి  ఆందోళన వ్యక్తం చేసింది. ఒకసారి విగ్రహం ఎంత వరకు వచ్చిందో చూడమని రాజుని ఒప్పించి పంపించింది. ఆయన తలుపు తెరిచి చూసినప్పుడు విశ్వకర్మ వెళ్ళిపోయాడు. జగన్నాథుడి మొహం మాత్రమే కలిగిన అసంపూర్ణమైన విగ్రహాన్ని ఉంచారు. అప్పటినుంచి ఇదే విగ్రహం ఉందని అంటారు. 

శ్రీరాముడు-బాలి 

జగన్నాథుడి విగ్రహం గురించి మరొక ప్రసిద్ధమైన కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.  రాముడు ఒక చెట్టు వెనుక రహస్య ప్రదేశంలో ఉండి బాలిని సంహరించాడు. అయితే శ్రీరాముడు దీని గురించి ఎంతో అపరాధ భావంతో ఉన్నాడు. బాలి మరణిస్తున్న సమయంలో అతనిని తన ఒడిలో పెట్టుకుని అన్యాయంగా చంపినందుకు తనకు ఏ శిక్షణ విధించిన అంగీకరిస్తానని శ్రీరాముని చెప్పాడు. అప్పుడు బాలి రాముడు అతనిపై బాణం వేసినందున అతని మణికట్టు అదృశ్యం అవుతుందని చెప్పాడు. రాముడికి ఆశ్రయం ఇచ్చిన చెట్టు చేదుగా మారుతుందని శాపం విధించాడు. అలా చెట్టు చేదుగా మారినప్పటికీ అందులో శ్రీరాముడు స్వరూపం ఉంటుందని రాముడు వాగ్దానం చేశాడు. ఆ చెట్టు వేప చెట్టు. కలియుగంలో జగన్నాథుడి విగ్రహానికి మణికట్టు ఉండదు. వేప వెదురుతోనే జగన్నాథుడి విగ్రహం తయారు చేస్తారు. 

స్వామి వారికి పెద్ద కళ్ళు ఎందుకు ఉంటాయి?

సాధారణంగా స్వామి వారి రూపంలో ముఖంలో కళ్ళు, శరీర భాగాలు అన్ని మామూలుగా ఉంటాయి. కానీ జగన్నాథుడికి మాత్రం పెద్ద కళ్ళు ఉంటాయి. దీని గురించి మరొక కథ ప్రాచుర్యంలో ఉంది. 

ఒకరోజు ద్వారకలో శ్రీకృష్ణుడి గురించి చెప్పడానికి మాతా రోహిణి అందరిని కూర్చోబెట్టింది. ఆ గుంపులో శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర కూడా ఉంటుంది. కానీ ఆమెను పంపించేస్తారు. దీంతో లోపల ఏం చెప్తున్నారు అని ఆసక్తిగా వినేందుకు ఆమె అక్కడే గది బయట నిలబడి పెద్ద కళ్ళు చేసుకుంటూ వినేది. ఆమెను చూసి కృష్ణుడు, బలరాముడు కూడా అలాగే పెద్ద కళ్ళు చేసుకుని ఆమె పక్కన నిలబడతారు. 

ముగ్గురూ అలా పెద్ద కళ్ళు చేసుకుని ఆశ్చర్యంగా వింటూ నిలబడిపోవడం నారదుడు చూశాడు. ముగ్గురు భక్తులకు ఇలాగే దర్శనం ఇస్తారని అన్నాడట.  అలా శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర కళ్ళు పెద్దవి చేసిన రూపంలో కనిపించారని చెబుతారు. జగన్నాథుడి పెద్ద కళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన భక్తులను గమనిస్తున్నాడని చెప్పేందుకు చిహ్నాలుగా భావిస్తారు. పురాతన గ్రంథాల ప్రకారం కళ్ళు ఆత్మకు కిటికీలుగా పరిగణిస్తారు. జగన్నాధుని పెద్ద కళ్ళు దైవిక దృష్టి, జ్ఞానానికి చిహ్నంగా ఉన్నాయి. 

అవి తన భక్తులపై భగవంతుని శాశ్వతమైన నిఘాన్ని సూచిస్తాయి. అది మాత్రమే కాకుండా జగన్నాథుడి కళ్ళు విస్తారమైన జ్ఞానము భక్తుల మీద అతనికి ఉన్న దృష్టిని సూచిస్తుందని చెబుతారు. 

జగన్నాథుడి విగ్రహానికి పెద్ద కళ్ళు పెట్టడం అనే సాంప్రదాయం శతాబ్దాల నుంచి వస్తుంది. జగన్నాథుని విగ్రహాన్ని చూడగానే భక్తులు తన్మయత్వం చెందుతారు. వారికి తెలియకుండా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయని చెబుతారు. 

మరెన్నో వింతలు 

ఇది మాత్రమే కాకుండా ఈ ఆలయంలో మరెన్నో వింతలు విశేషాలు, రహస్యాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని మూడో మెట్టుపై యమశిల ఉందని చెప్తారు. దీని వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ మూడో మెట్టు ఎక్కితే చేసిన పుణ్యఫలం అంతా పోయి నరకానికి వెళతారని అంటారు. అందుకే సింహద్వారం నుంచి మూడో మెట్టు ఎక్కినప్పటికీ తిరిగి మళ్లీ అదే మెట్టు నుంచి బయటికి వెళ్లినప్పుడు మాత్రమే ఈ పుణ్యం పోతుందని అంటారు. అందుకే భక్తులు సింహ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించినప్పటికీ వేరొక మార్గం నుంచి ఆలయం నుంచి నిష్క్రమిస్తారు. 

 

Whats_app_banner