పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రోజు ఈ భూమి నుంచి వెళ్ళిపోక తప్పదు. చనిపోయిన తర్వాత కూడా ఎన్నో సంప్రదాయాలని పాటిస్తూ ఉంటారు. మరణం తర్వాత చనిపోయిన వ్యక్తి నోట్లో గంగాజలం, తులసి ఆకుల్ని వేస్తారు. దాని వెనుక కారణం ఏంటి? శాస్త్రం ఏం చెప్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గంగాజలం పవిత్రతకు చిహ్నం. తులసి విష్ణువుతో అనుబంధాన్ని కలిగి ఉంటుందని భావించబడుతుంది. అందుకే రెండిటినీ చనిపోయిన వ్యక్తి నోట్లో వేస్తారు. దాని వలన చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
ఎప్పుడైనా మనం ఏదైనా పూజ చేసినప్పుడు, పూజ సామాగ్రితో పాటుగా పూజ చేసే వారిపై కూడా నీరు జల్లి శుద్ధి చేస్తారు. అన్ని జలాల్లో గంగాజలం పవిత్రమైనది. గంగానదిని “స్వర్గనది” అని కూడా అంటారు. ఇది విష్ణువుని పాదాల నుంచి ఉద్భవించింది, శివుడి శరీరంలో నివసించింది.
ఈ కారణంగా మరణ సమయంలో నోట్లో గంగాజలాన్ని వేస్తారు. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు బాధను పెద్దగా అనుభవించదని కూడా అంటారు. చనిపోయిన వ్యక్తి నోట్లో గంగా నీటిని వేయడం వలన ఆ మనిషిని చనిపోయాక ఇబ్బంది పెట్టరని కూడా చెప్తారు. దీంతో ఆత్మ తదుపరి ప్రయాణం సులభంగా మారుతుంది.
తులసికి విష్ణువుతో సంబంధం కలిగి ఉంది. తులసి ఆకుల్ని నోట్లో వేయడం వలన యమ ధర్మరాజు ఏ హానీ కూడా చేయరని అంటారు. మరణం తర్వాత ఆ వ్యక్తి యముడు వేసే శిక్షలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని కూడా చెప్తారు. ఈ కారణంగానే చనిపోయిన వారి నోట్లో తులసి ఆకుల్ని వేస్తారు. దాంతో మోక్షం లభిస్తుందని అంటారు.
ఈ రెండిటిని చనిపోయిన వ్యక్తి నోట్లో వేయడం వలన యముడు వారిని నేరుగా స్వర్గానికి తీసుకువెళ్తారట. తులసి ఆకుల్ని విష్ణువు తన నుదుటిపై ధరించేవాడు. చనిపోయిన వ్యక్తిపై తులసి ఆకుల్ని ఉంచితే ఆత్మకు శాంతి లభిస్తుంది. అందుకే చనిపోయిన వారి నోట్లో తులసి ఆకుల్ని, గంగాజలాన్ని వేస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.