ప్రతీ సంవత్సరం సింహాద్రి అప్పన్నకు అక్షయ తృతీయ నాడు చందనోత్సవాన్ని జరుపుతారు. ఇది చాలా విశిష్టమైనది. ఈరోజు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు చందనోత్సవాన్ని చూడడానికి వస్తారు. సింహాచలంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఏడాదిలో 12 గంటలు మాత్రమే నిజరూప దర్శనంలో దర్శనం ఇస్తారు.
ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ నాడు చందనోత్సవాన్ని జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా నరసింహ స్వామి వారి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగిస్తారు. 12 గంటల పాటు భక్తులు నిజరూప దర్శనాన్ని చేసుకోవచ్చు. ఆ తర్వాత తొలి విడత చందనాన్ని సమర్పిస్తారు. చందనోత్సవం నాడు సింహాచలం నరసింహ స్వామి వారిని నిజరూపంలో దర్శించుకోవడం వలన సమస్త సమస్యలు తొలగిపోయి, సంతోషంగా జీవించొచ్చు. పైగా మోక్షాన్ని కూడా పొందవచ్చని శాస్త్రవచనం.
ఈసారి అక్షయ తృతీయ ఏప్రిల్ 30న వచ్చింది. ఈరోజు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సంతోషంగా ఉండొచ్చు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సిరిసంపదలు కలుగుతాయి.
హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించాలని విష్ణువు వరాహ అవతారాన్ని, హిరణ్యకశిపుడుని సంహరించాలని నృసింహ అవతారాన్ని ఎత్తాడు. ఈ రాక్షసులు ఇద్దరు అన్నదమ్ములు. శ్రీహరి వీరిద్దరిని సంహరించాలని ఈ అవతారాలు ఎత్తాడు. హిరణ్యాక్షుడిని వధించిన మహావిష్ణువు వరాహ అవతారాన్ని విరమించేలోగా హిరణ్యకశిపుడు చెప్పిన దాని ప్రకారం, ప్రహ్లాదుడు శ్రీహరిని పిలవడంతో భక్తుడని రక్షించాలని తొందరపడి వరహ రూపాన్ని వదలకుండా నృసింహ రూపంలో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు.
హిరణ్యకశిపుని సంహరించాక నరసింహుడు భయంకరంగా జ్వాలా మాలికలతో కనపడ్డాడు. దీంతో సమస్త సృష్టి భయపడిపోయింది. దేవతలు, ప్రహ్లాదుడు ప్రార్థించినా సరే ఉపయోగం లేకపోయింది.
అప్పుడు బ్రహ్మకు చందన వృక్షం గుర్తు వచ్చింది. ఉగ్రం, తాపం నివారించే శక్తి చందనానికి ఉందని ప్రహ్లాదుడికి సూచించాడు. అప్పుడు బ్రహ్మ సూచించిన మేరకు ప్రహ్లాదుడు చందన సేవ చేశాడు. దాంతో నరసింహుడు శాంతించాడు. ప్రహ్లాదుడు కోరిక ప్రకారం వరాహ నృసింహ రూపంలో సింహాచలం పై కొలువయ్యాడు. ఇదంతా అక్షయ తృతీయ నాడు జరిగింది.
ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ అనే పిలుస్తాడు. స్వామి వారు గరుత్మంతుడి పై నుంచి కిందకు దూకడంతో పాదాలు పాతాళంలోకి దిగబడతాయి. అందుకే వరాహ నారసింహుడి పాద దర్శనం భక్తులకి ఉండదు.
పురారవ చక్రవర్తి పుష్పక విమానంలో ఊర్వశితో పాటు వస్తుంటే ఆ విమానం సింహగిరిపై వచ్చేటప్పటికి హఠాత్తుగా ఆగిపోయింది. అప్పుడు ఊర్వశి తన దివ్యదృష్టి ద్వారా ఈ కొండకి ఎంతో మహిమ ఉందని చక్రవర్తికి చెప్తుంది. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.
స్వామి వారు కలలో కనపడి, ఇక్కడే తను ఉన్నానని ఉత్సవం చేయాలని కోరుతారు. పురారవ చక్రవర్తి వెతికినా ఫలితం ఉండదు. రెండవ రోజు మళ్ళీ స్వామి వారు కలలో కనపడి 12 అడుగులు ఉన్న పుట్టలో ఉన్నట్లు చెప్తారు. అప్పుడు స్వామి వారి విగ్రహాన్ని బయటకు తీసి వైభవంగా చందనోత్సవాన్ని జరుపుతారు.
ప్రతీ ఏటా అక్షయ తృతీయ నాడు లింగ రూప దర్శనం ఉంటుంది. ఈ సమయంలో లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. అక్షయ తృతీయతతో పాటుగా జ్యేష్ట పూర్ణిమ, ఆషాడ పూర్ణిమ నాడు కూడా మూడు విడతల్లో స్వామివారికి 12 మణుగుల పరిమాణంలో చందనాన్ని సమర్పించడం జరుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం