చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి కలిగి, సంతోషంగా ఉండవచ్చు. ఇంట్లో వాస్తు నియమాలను పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి, సంతోషంగా ఉండవచ్చు. ఇంట్లో సంపద, శాంతి, ప్రేమానురాగాలు ఇవన్నీ ఉండాలంటే కచ్చితంగా వాస్తు నియమాలని పాటించాలి.
ఏ దిశలో ఏ వస్తువులు ఉండాలి అనేది చూసుకుని దాని ప్రకారం అనుసరించాలి. చాలా మంది ఇంట్లో మట్టి కుండలో నీళ్లు నింపి ఉంచుతారు. అలా చేస్తే ధన లాభం, సానుకూల శక్తిని తీసుకురావడానికి అవుతుంది. అయితే మట్టి కుండలో నీటిని నింపి ఏ దిశలో ఉంచాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన దశలో పెట్టకపోతే చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
మట్టి కుండని సరైన దిశలో పెట్టాలి. మట్టి కుండలో నీరు చల్లగా ఉంటుంది. అందుకని చాలా మంది వేసవిలో మట్టి కుండలో నీటిని తాగుతారు. పైగా దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందడానికి అవుతుంది. మట్టికుండలో నీళ్లు పోసి ఎటువైపు ఉంచితే మంచిది అనే విషయానికి వస్తే, ఆఫీస్ లో కానీ ఇంట్లో కానీ మట్టి కుండలో నీళ్లు నింపి ఉత్తరం వైపు పెడితే మంచిది.
ఉత్తరం ఐదు మూలకాలలోని నీటి మూలకానికి సంబంధం కలిగి ఉంది. ఉత్తరం వైపు మట్టికుండ పెట్టడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. దురదృష్టం తొలగిపోయి సంపద కలుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.
ఈ దిశలో మట్టికుండనే ఉంచితే లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయి. మానసిక ఒత్తిడి నుంచి కూడా బయటపడటానికి అవుతుంది.
ఇంట్లో నీటిని నింపిన మట్టికుండనే పెట్టడం వలన అదృష్టం కలుగుతుంది. అదృష్టాన్ని ఆకర్షించడానికి నీటి కుండ దగ్గర దీపం పెడితే కూడా మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.