భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజ చేసే టప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూలు సమర్పిస్తారు. పూలు లేకుండా దేవుడికి పూజ పూర్తవదు. కానీ కొన్ని రకాల పూలు మాత్రం అసలు పూజకి పనికి రావు. వాటిని ఇతర కార్యక్రమాలకి వాడిన కూడా పూజ చేసేందుకు ఉపయోగించరు. దేవుడి ఆశీర్వాదం పొందాలని అనుకుంటే తప్పనిసరిగా పూలతో పూజ చేయాల్సిందే.
ఒక్కో దేవత/ దేవుడికి ఒక్కో రకం పూలు ఇష్టం. ఉదయం, సాయంత్రం పూజ చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసే చెట్టు నుంచి పూలు అప్పటికప్పుడు కోసి తీసుకెళ్ళి దేవుడికి సమర్పిస్తారు. దేవతలకి పుష్పాలు సమర్పించడం అంటే ప్రేమ, భక్తిని వ్యక్తపరచడం. పూజా స్థలం దగ్గర వాటిని పెట్టడం వల్ల ఆ ప్రదేశం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ప్రశాంతత, సానుకూల భావాన్ని ఇస్తుంది.
పూజ అనే పదంలోనే పువ్వులు ఉన్నాయి. ప్రార్థన అంటే పుష్పాల సమర్పించుకోవడం. కానీ దేవుని అనుగ్రహం కోసం చేసే పూజలో కొన్ని రకాల పువ్వులు ఉపయోగించరు. అవి ఏంటో తెలుసా?
ఘాటైన వాసన కలిగిన మొగలి పువ్వు పూజకి పనికిరాని వాటిలో మొదటిది. అవి పూజకి ఉపయోగించకపోవడం వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. ఒకనాడు విష్ణుమూర్తి, బ్రహ్మ మేం గొప్ప అంటే మేము గొప్ప అని వాదులాడుకున్నారు. వారి సమస్య పరిష్కరించేందుకు శివుడు ఒక పరీక్ష పెట్టాడు.
తన శివలింగానికి ఆద్యంతాలు ఏవో కనిపెట్టమని పరీక్ష పెట్టాడు. ఎంత వెతికినా కానీ ఇద్దరూ కనిపెట్టలేకపోయారు. తనే గెలవాలనే ఉద్దేశంలో బ్రహ్మ గోమాత, మొగలి చెట్టుతో అబద్ధం చెప్పిస్తాడు.
నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో ఇద్దరికీ శాపం పెడతాడు. మొగలి పువ్వు పూజకి పనికిరాదని శపిస్తాడు. ఇక గోవు మొహం చూస్తే శాపం అని చెప్తాడు. అందుకే అందరూ గోమాతకి వెనుక తోక వైపు పూజ చేస్తారు.
బంతిపూలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే తప్పనిసరిగా బంతిపూలతో సుందరంగా అలకరిస్తారు. కానీ పూజ చేసేందుకు మాత్రం ఉపయోగించరు. కారణం అది ఎక్కువగా క్రిమి కీటకాలని ఆకర్షిస్తుంది.
ఎంతో మధురమైన వాసన కలిగిన సన్నజాని, సంపంగి పూలు, మల్లెలు కూడా పూజకి వినియోగించరు.
టాపిక్