Vasantha Panchami 2025: ఈ వసంత పంచమి నాడు మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలా? అయితే పూజా విధానం తెలుసుకోండి..-when is vasantha panchami 2025 check date and time also see the procees of aksharabyasam here are pooja full details ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vasantha Panchami 2025: ఈ వసంత పంచమి నాడు మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలా? అయితే పూజా విధానం తెలుసుకోండి..

Vasantha Panchami 2025: ఈ వసంత పంచమి నాడు మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలా? అయితే పూజా విధానం తెలుసుకోండి..

Peddinti Sravya HT Telugu
Jan 29, 2025 09:00 AM IST

Vasantha Panchami 2025: హిందూ క్యాలెండర్ ప్రకారం, వసంత పంచమి ఈ సంవత్సరం ఫిబ్రవరి 02న వస్తుంది. వసంత పంచమి రోజును సరస్వతీ దేవి ఆరాధనకు అంకితం చేస్తారు. ఈ రోజున సరస్వతీ పూజ కోసం ఈ వస్తువులను సిద్ధం చేసుకోండి

Vasantha Panchami 2025: వసంత పంచమి నాడు సరస్వతీ దేవి పూజ చేస్తున్నారా?
Vasantha Panchami 2025: వసంత పంచమి నాడు సరస్వతీ దేవి పూజ చేస్తున్నారా?

వసంత పంచమి పండుగ కూడా హిందూ మతంలో ప్రధాన పండుగలలో ఒకటి. ఈ రోజును వసంత ఋతువు రాకగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్లపక్షంలో ఐదవ రోజున వసంత పంచమిని జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ రోజున సరస్వతీ దేవి దర్శనమిచ్చింది. అందుకే వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని పూజిస్తారు.

yearly horoscope entry point

ద్రిక్ పంచాంగం ప్రకారం, వసంత పంచమి ఈ సంవత్సరం 02 ఫిబ్రవరి 2025న జరుపుకోబడుతుంది. ఇలా చేయడం వల్ల సరస్వతీ దేవి వృత్తిలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి జ్ఞానం, మధురమైన వాక్కును ప్రసాదిస్తుందని నమ్ముతారు.

వసంత పంచమి పర్వదినాన శారదామాతను ప్రసన్నం చేసుకోవాలంటే పూజలో కొన్ని విషయాలు చేర్చాలి. వసంత పంచమి నాడు సరస్వతీ పూజ కోసం కావాల్సిన సామాగ్రిని తెలుసుకుందాం.

వసంత పంచమి 2025 ఎప్పుడు?

ద్రిక్ పంచాంగం ప్రకారం, మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని పంచమి తిథి ఫిబ్రవరి 02 ఉదయం 09:14 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 03 ఉదయం 06:52 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, వసంత పంచమిని 2 ఫిబ్రవరి 2025 న జరుపుకోనున్నారు.

సరస్వతి పూజ శుభ సమయం:

వసంత పంచమి రోజున సరస్వతి పూజ శుభ సమయం ఉదయం 07.09 నుండి మధ్యాహ్నం 12.35 వరకు ఉంటుంది.

అక్షరాభ్యాసం చేసే విధానం

అక్షరాభ్యాసం చేయించే బాబు లేదా పాపకి తలస్నానం చేయించాలి. కొత్త బట్టలు వేయాలి. పూజ మందిరంలో ఉన్న దేవతామూర్తులకు నమస్కారం చేయించాలి. ఆ తర్వాత వినాయకుడు పూజ, సరస్వతీ పూజ చేయించాలి.

తర్వాత ఒక పళ్లెంలో బియ్యం పోసి మూడు భాగాల కింద విభజించి రెండు గీతలు గీయించి, పై భాగంలో ఓం అని రెండవ గడిలో నమశ్శివాయ అని మూడవ భాగంలో సిద్ధం నమః అని మూడు పర్యాయములు పురహితుడు బాబు చేత రాయిస్తారు.

ఆ తర్వాత వినాయకుడు, సరస్వతి శ్లోకాలని పఠించాలి. ఇంట్లో ఉన్న పెద్దలు చేత బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పలక మీద 'ఓం నమశ్శివాయ' అని ముందు రాయించి, తర్వాత అక్షరాలు రాసి దిద్దించాలి.

5 లేక 9 మందికి పలక, బలపం, ఎక్కాల పుస్తకం వంటివి పంచిపెట్టొచ్చు. వేయించిన శనగపప్పు, మరమరాలు, బెల్లం కలిపి పిల్లలకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే తోటి పిల్లలకు బాబుపై ప్రేమానురాగాలు పెరుగుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం