ఈ సంవత్సరం శని జయంతి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు సుఖ సంతోషాలు కలిగి, శని బాధలు తొలగిపోవాలంటే ఏ పరిహారాలు పాటించాలో తెలుసా?-when is shani jayanthi 2025 and also see remedies to be followed on this day for happy life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ సంవత్సరం శని జయంతి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు సుఖ సంతోషాలు కలిగి, శని బాధలు తొలగిపోవాలంటే ఏ పరిహారాలు పాటించాలో తెలుసా?

ఈ సంవత్సరం శని జయంతి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు సుఖ సంతోషాలు కలిగి, శని బాధలు తొలగిపోవాలంటే ఏ పరిహారాలు పాటించాలో తెలుసా?

Peddinti Sravya HT Telugu

ఈ సంవత్సరం, శని జయంతి 2025, మే 27, మంగళవారం నాడు వచ్చింది. శని అనుగ్రహం పొందడానికి హిందూ మతంలో శని జయంతిని ఒక ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం.

శని జయంతి

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. శని జయంతిని శని అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున సూర్య దేవుడు, ఛాయా కుమారుడు శనిదేవుడు జన్మించారని విశ్వసిస్తారు. జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడిని కర్మ ప్రదాతగా భావిస్తారు. శని దేవుడు ప్రతి వ్యక్తికి తన కర్మ ప్రకారం ఫలాలను ప్రసాదిస్తాడు.

ఈ సంవత్సరం, శని జయంతి 2025, మే 27, మంగళవారం నాడు వచ్చింది. శని అనుగ్రహం పొందడానికి హిందూ మతంలో శని జయంతిని ఒక ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం. శని జయంతి రోజున శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలో తెలుసుకోండి.

శని జయంతి పరిహారాలు

1. శని జయంతి రోజున శని దేవుడికి ఆవనూనెను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శని వలన కలిగే నష్టాల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు.

2. శని జయంతి రోజున రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం పెట్టడం శ్రేయస్కరంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు సంతోషిస్తాడని నమ్ముతారు.

3. శని అనుగ్రహం పొందడానికి, శని జయంతి రోజున నల్ల దుస్తులు, గొడుగులు, ఆహారం, ఇనుము వస్తువులను దానం చేస్తే మంచిది.

4. శని జయంతి రోజున శని స్తోత్రం, శని మంత్రం, శని చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు సంతోషించి ఆశీస్సులు అందిస్తాడని నమ్ముతారు. శని జయంతి రోజున హనుమంతుడిని పూజించి, శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించాలి.

5. శని జయంతి రోజున నల్ల కుక్కకు ఆవనూనెతో రొట్టె తినిపించాలి. ఇలా చేయడం వల్ల శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.