ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్దశి నాడు నరసింహ జయంతిని జరుపుకుంటాము. ఈసారి నరసింహ జయంతి ఎప్పుడు వచ్చింది?, ఈరోజు ఎటువంటి వాటిని పాటించాలి వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
మే 10 శనివారం సాయంత్రం 5:29 గంటలకు చతుర్దశి తిధి మొదలవుతుంది. తర్వాత రోజు అంటే మే 11న ఆదివారం రాత్రి 8:01 తో ముగుస్తుంది. దీని ప్రకారం మే 11న ఆదివారం నాడు నరసింహ జయంతిని జరుపుకోవాలి.
మే 11న ఆదివారం ఉదయం 10:57 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. సాయంత్రం పూజ చేసుకోవాలనుకునే వారు సాయంత్రం 4:21 నుంచి 7:03 వరకు చేసుకోవచ్చు. ఈ పవిత్ర సమయంలో స్వామి వారిని ఆరాధించడం వలన ఆత్మవిశ్వాసం, ధైర్యం, వినయం కలుగుతాయి.
విష్ణువు దశావతారాల్లో నాలుగో అవతారం నరసింహుని అవతారం. ప్రహ్లాదుడుని కాపాడుకోవాలని హిరణ్యకశిపుడిని వధించడానికి విష్ణువు నరసింహ అవతారాన్ని ఎత్తాడు. ఈ స్వామి ఎప్పుడూ కూడా ఉగ్రరూపంలో ఉంటాడు. భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడుకోవాలని శ్రీహరి ఈ రూపంలో అవతరించాడు.
చెడుపై మంచి గెలిచిందన్న కారణంగా నరసింహ జయంతిని జరుపుకుంటాము. ఈరోజు ఉపవాసం ఉండి, స్వామివారిని ఆరాధించడం వలన సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.